CM Revanth Reddy: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు..
- రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు
- రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలి- సీఎం
- ప్రతీ మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలి
- వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి- రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతీ మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని సీఎం తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి.. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదని కలెక్టర్లకు తెలిపారు. అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు.
Read Also: CM Revanth Reddy: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం..
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి.. వీటితోపాటు విలేజ్ మ్యాప్లను పరిశీలించి అధికారులు ఫీల్డ్కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకోవాలని అన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని పేర్కొన్నారు. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి.. ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..