Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడి
- ఐదుగురు జర్నలిస్టులు మృతి
- జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అన్న ఐడీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు.
ఇది కూడా చదవండి: Sreeleela : శ్రీలీలకు తమిళ్లో మరో బంపర్ ఆఫర్?
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.
ఇది కూడా చదవండి: Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో జర్నలిస్టుల కోసం టెంట్ వేసి ఉంది. అందులో అల్ జజీరా జర్నలిస్టులు ఉన్నారు. అక్కడే అల్-షరీఫ్ కూడా ఉన్నాడు. ఇతడిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. అతడితో పాటు మరో నలుగురు జర్నలిస్టులు చనిపోయారు. మృతుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహ్మమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నట్లుగా బ్రాడ్కాస్టర్ తెలిపింది. ఏడుగురు చనిపోతే.. అందులో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంది.
అల్-షరీఫ్.. గాజాలో పని చేస్తున్న ఒక ఛానెల్ రిపోర్టర్. అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తుల్లో అల్ షరీఫ్ ఒకరు. రోజువారీ నివేదికలు క్రమం తప్పకుండా కవరేజ్ చేస్తుంటాడు. అయితే ఇతడు హమాస్కు మద్దతుగా.. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇక అల్ జజీరా ఛానల్ కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పని చేస్తోంది. దీంతో ఆ ఛానల్ను ఇజ్రాయెల్ నిషేధించింది. అంతేకాకుండా ఈ ఛానల్కు ఖతార్ నిధులు కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్పై దాడుల ప్రణాళికలకు అల్ షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించడంతో తాజా దాడుల్లో ఐడీఎఫ్ చంపేసింది.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalist
Al-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.
Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse— Israel Defense Forces (@IDF) August 10, 2025
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!