Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడి
- ఐదుగురు జర్నలిస్టులు మృతి
- జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అన్న ఐడీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు.
ఇది కూడా చదవండి: Sreeleela : శ్రీలీలకు తమిళ్లో మరో బంపర్ ఆఫర్?
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.
ఇది కూడా చదవండి: Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో జర్నలిస్టుల కోసం టెంట్ వేసి ఉంది. అందులో అల్ జజీరా జర్నలిస్టులు ఉన్నారు. అక్కడే అల్-షరీఫ్ కూడా ఉన్నాడు. ఇతడిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. అతడితో పాటు మరో నలుగురు జర్నలిస్టులు చనిపోయారు. మృతుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహ్మమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నట్లుగా బ్రాడ్కాస్టర్ తెలిపింది. ఏడుగురు చనిపోతే.. అందులో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంది.
అల్-షరీఫ్.. గాజాలో పని చేస్తున్న ఒక ఛానెల్ రిపోర్టర్. అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తుల్లో అల్ షరీఫ్ ఒకరు. రోజువారీ నివేదికలు క్రమం తప్పకుండా కవరేజ్ చేస్తుంటాడు. అయితే ఇతడు హమాస్కు మద్దతుగా.. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇక అల్ జజీరా ఛానల్ కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పని చేస్తోంది. దీంతో ఆ ఛానల్ను ఇజ్రాయెల్ నిషేధించింది. అంతేకాకుండా ఈ ఛానల్కు ఖతార్ నిధులు కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్పై దాడుల ప్రణాళికలకు అల్ షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించడంతో తాజా దాడుల్లో ఐడీఎఫ్ చంపేసింది.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalist
Al-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.
Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse— Israel Defense Forces (@IDF) August 10, 2025
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..