Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడి
- ఐదుగురు జర్నలిస్టులు మృతి
- జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అన్న ఐడీఎఫ్
ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు.
ఇది కూడా చదవండి: Sreeleela : శ్రీలీలకు తమిళ్లో మరో బంపర్ ఆఫర్?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.
ఇది కూడా చదవండి: Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో జర్నలిస్టుల కోసం టెంట్ వేసి ఉంది. అందులో అల్ జజీరా జర్నలిస్టులు ఉన్నారు. అక్కడే అల్-షరీఫ్ కూడా ఉన్నాడు. ఇతడిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. అతడితో పాటు మరో నలుగురు జర్నలిస్టులు చనిపోయారు. మృతుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహ్మమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నట్లుగా బ్రాడ్కాస్టర్ తెలిపింది. ఏడుగురు చనిపోతే.. అందులో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంది.
అల్-షరీఫ్.. గాజాలో పని చేస్తున్న ఒక ఛానెల్ రిపోర్టర్. అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తుల్లో అల్ షరీఫ్ ఒకరు. రోజువారీ నివేదికలు క్రమం తప్పకుండా కవరేజ్ చేస్తుంటాడు. అయితే ఇతడు హమాస్కు మద్దతుగా.. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇక అల్ జజీరా ఛానల్ కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పని చేస్తోంది. దీంతో ఆ ఛానల్ను ఇజ్రాయెల్ నిషేధించింది. అంతేకాకుండా ఈ ఛానల్కు ఖతార్ నిధులు కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్పై దాడుల ప్రణాళికలకు అల్ షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించడంతో తాజా దాడుల్లో ఐడీఎఫ్ చంపేసింది.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalist
Al-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.
Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse— Israel Defense Forces (@IDF) August 10, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!