Twitter: ఎలాన్ మస్క్ సంచనల నిర్ణయం.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk fires entire Twitter board to become sole director: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురు ఉద్యోగులను పీకేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేశారు. తానే ఏకైక డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు ఉంటాయని వచ్చిన వార్తలను తిరస్కరించిన కొన్ని గంటల్లోనే బోర్డును రద్దు చేశారు. 9 మంది డైరెక్టర్లను తొలగించారు.
ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యకు తీసుకున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా కమర్షియల్ గా మార్చేందుకు మస్క్ సిద్ధం అయ్యారు. ట్విట్టర్ లో పెయిడ్ వెర్షన్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు. నెలవారీ బ్లూటిక్ సహా.. అదనపు ఫీచర్ల సబ్స్ స్క్రిప్షన్ల ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. కంపెనీ ఆదాయంలో సగం సబ్స్ స్క్రిప్షన్ల ద్వారానే సంపాదించాలని భావిస్తున్నారు. నవంబర్ 7 కల్లా దీనిపై కసరత్తు చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
Read Also: Tirupati Crime: రెచ్చిపోయిన దొంగలు.. నవ దంపతుల కళ్లలో కారం చల్లి కత్తితో దాడి.. భర్త మృతి
మరోవైపు ట్విట్టర్ లో ఉద్యోగుల కోతకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయగద్దెతో సహా పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 7,500 నుంచి 2000 లకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇండియాకు చెందిన శ్రీరామ్ కృష్ణన్, ఎలాన్ మస్క్ కు సహాయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను తీసేసిన మస్క్, మరో ఇండియన్ సహాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శ్రీరామ్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ పై పట్టుబిగిస్తున్న మస్క్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేదానిపై ప్రపంచం మొత్తం చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!