Twitter: ఎలాన్ మస్క్ సంచనల నిర్ణయం.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk fires entire Twitter board to become sole director: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురు ఉద్యోగులను పీకేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేశారు. తానే ఏకైక డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు ఉంటాయని వచ్చిన వార్తలను తిరస్కరించిన కొన్ని గంటల్లోనే బోర్డును రద్దు చేశారు. 9 మంది డైరెక్టర్లను తొలగించారు.
ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యకు తీసుకున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా కమర్షియల్ గా మార్చేందుకు మస్క్ సిద్ధం అయ్యారు. ట్విట్టర్ లో పెయిడ్ వెర్షన్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు. నెలవారీ బ్లూటిక్ సహా.. అదనపు ఫీచర్ల సబ్స్ స్క్రిప్షన్ల ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. కంపెనీ ఆదాయంలో సగం సబ్స్ స్క్రిప్షన్ల ద్వారానే సంపాదించాలని భావిస్తున్నారు. నవంబర్ 7 కల్లా దీనిపై కసరత్తు చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
Also Read
Read Also: Tirupati Crime: రెచ్చిపోయిన దొంగలు.. నవ దంపతుల కళ్లలో కారం చల్లి కత్తితో దాడి.. భర్త మృతి
మరోవైపు ట్విట్టర్ లో ఉద్యోగుల కోతకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయగద్దెతో సహా పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 7,500 నుంచి 2000 లకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇండియాకు చెందిన శ్రీరామ్ కృష్ణన్, ఎలాన్ మస్క్ కు సహాయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను తీసేసిన మస్క్, మరో ఇండియన్ సహాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శ్రీరామ్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ పై పట్టుబిగిస్తున్న మస్క్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేదానిపై ప్రపంచం మొత్తం చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!