Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
- పాకిస్థాన్ జైలు దగ్గర ఇమ్రాన్ఖాన్ సోదరిపై దాడి
- ఇద్దరు మహిళలు కోడిగుడ్డుతో దాడి.. అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సోదరికి ఘోర అవమానం జరిగింది. దుండగులు దారుణానికి ఒడిగట్టారు. మీడియాతో మాట్లాడుతుండగా హఠాత్తుగా కోడిగుడ్డు విసిరారు. ముఖం మీద తగలడంతో హడలిపోయింది. ఆమెతో పాటు చుట్టు ఉన్నవారంతా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Harish Rao: కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు..
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ మీడియాతో మాట్లాడుతుంది. తోషఖానా కేసు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంకొన్ని ప్రశ్నలను ఆమె దాట వేసింది. దీంతో మీకు నచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి.. నచ్చని ప్రశ్నలను దాట వేస్తారంటూ ఆమెపై కోడిగుడ్డు విసిరారు. ఆమె గడ్డానికి తగిలి బట్టలపై చిందింది. అంతేకాకుండా ఈ హఠాత్తు పరిమాణంతో ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడింది. ఒక మహిళ ‘ఇది ఎవరు?’, ‘కిస్నే కియా యే (ఇది ఎవరు చేసారు)’ అని అరుస్తున్నట్లు కనిపించింది. అలీమా ఖనుమ్ మాత్రం షాక్లోకి వెళ్లిపోయింది. మిగతా వారు గుడ్డు విసిరిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు.. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులని చెప్పారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నను అలీమా ఖనుమ్ దాటవేయడంతో గుడ్డు విసిరారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్..
అయితే ఈ దాడిని పీటీఐ మద్దతుదారులు ఖండించారు. ఇటు చర్య అనైతికమే కాదు.. దురదృష్టకరం కూడా అని వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్య రాజకీయ విభేదాలు, అవమానాలు.. దాడులకు ప్రేరేపిస్తోందని తెలిపింది. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. కానీ మర్యాద.. గౌరవాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని పేర్కొంది. అయితే ఇమ్రాన్ఖాన్ కుటుంబాన్ని భయపెట్టేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తోషాఖాన్ అంటే ఏంటి? అసలు ఈ కేసేంటి?
తోషాఖానా లేదా ట్రెజర్ హౌస్. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే బహుమతులు ఉంటాయి. తోషాఖానాలో ప్రధాన మంత్రులు, అధ్యక్షులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారులు అందుకున్న విలువైన బహుమతులు ఉంటాయి. 2023, ఆగస్టులో 140 మిలియన్ల పాకిస్థానీ రూపాయల ($500,000) కంటే ఎక్కువ విలువైన బహుమతులను ఇమ్రాన్ఖాన్ అమ్మేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇమ్రాన్ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ఖాన్, అతని భార్య బుష్రా బీబీపై తోషాఖానా కేసు నడుస్తోంది. శుక్రవారం విచారణ జరిగి వాయిదా పడింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా పడింది.
Strongly condemn the disgraceful act of throwing an egg at Aleema Khanum, sister of former Prime Minister Imran Khan. No political disagreement should ever justify such disrespect. Pakistan’s politics need dialogue, not humiliation. #AleemaKhanum #StayStrongAleemaKhan pic.twitter.com/U5e2J1djPc
— SAQIB (@saqibhussaiinn) September 5, 2025

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..