Earthquake: నేపాల్ లో భూకంపం.. 6.0 తీవ్రతతో కంపించిన భూమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake Hits Nepal: నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం..నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలోని ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఆదివారం ఉదయం 8.13 గంటలకు భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉపరితనం నుంచి 10 కిలోమీటర్ లోతులో ఉంది. నేపాల్ భూకంపాలు తరుచుగా వచ్చే ప్రాంతాల జాబితాలో ఉంది. ఇండియా ఉపఖండం టెక్లానిక్ ప్లేట్ తరుచుగా కదలుతుండటంతో హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి.
Read Also: Joe Biden: యూఎస్ ప్రెసిడెంట్ కు మరోసారి కోవిడ్ పాజిటివ్
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
ఏప్రిల్ 25, 2015లో నేపాల్ లో సంభవించిన భూకంపం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజధాని ఖాట్మాండు, పోఖరా నగరాల మధ్య సంభవించిన భూకంపం వల్ల 8,964 మంది మరణించారు..22,000 మంది గాయపడినట్లు అంచనా. గోర్ఖా భూకంపంగా పిలువబడే ఈ భూకంపం 7.8 తీవ్రతతో వచ్చింది. దీని ధాటికి నేపాల్ తో సహా ఇండియా, పాకిస్తాన్ లోని లాహోర్, టిబెట్ లోని లాసా, బంగ్లాదేశ్ ఢాకాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ఖాట్మాండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కూడా మూసేశారు. భూకంపం వల్ల ఎవరెస్ట్ శిఖరంపై హిమపాతం, అవలాంచ్ సంభవించి 22 మంది మరణించారు. దీని తర్వాత కూడా మే 12,2015లో కూడా మరోసారి నేపాల్ లో భూకంపం వచ్చింది. దీని వల్ల 200 మంది మరణించడంతో పాటు 2500 మంది గాయపడ్డారు. నేపాల్ లో 1934లో అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చింది. దాదాపుగా 8.0 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. ఖాట్మాండుతో పాటు భక్తపూర్, పటాన్ నగరాలు దారుణంగా నాశనం అయ్యాయి. తరుచుగా హిమాలయ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుండటంతో హిమాలయాల ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?