Earthquake: నేపాల్ లో భూకంపం.. 6.0 తీవ్రతతో కంపించిన భూమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake Hits Nepal: నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం..నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలోని ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఆదివారం ఉదయం 8.13 గంటలకు భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉపరితనం నుంచి 10 కిలోమీటర్ లోతులో ఉంది. నేపాల్ భూకంపాలు తరుచుగా వచ్చే ప్రాంతాల జాబితాలో ఉంది. ఇండియా ఉపఖండం టెక్లానిక్ ప్లేట్ తరుచుగా కదలుతుండటంతో హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి.
Read Also: Joe Biden: యూఎస్ ప్రెసిడెంట్ కు మరోసారి కోవిడ్ పాజిటివ్
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ఏప్రిల్ 25, 2015లో నేపాల్ లో సంభవించిన భూకంపం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజధాని ఖాట్మాండు, పోఖరా నగరాల మధ్య సంభవించిన భూకంపం వల్ల 8,964 మంది మరణించారు..22,000 మంది గాయపడినట్లు అంచనా. గోర్ఖా భూకంపంగా పిలువబడే ఈ భూకంపం 7.8 తీవ్రతతో వచ్చింది. దీని ధాటికి నేపాల్ తో సహా ఇండియా, పాకిస్తాన్ లోని లాహోర్, టిబెట్ లోని లాసా, బంగ్లాదేశ్ ఢాకాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ఖాట్మాండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కూడా మూసేశారు. భూకంపం వల్ల ఎవరెస్ట్ శిఖరంపై హిమపాతం, అవలాంచ్ సంభవించి 22 మంది మరణించారు. దీని తర్వాత కూడా మే 12,2015లో కూడా మరోసారి నేపాల్ లో భూకంపం వచ్చింది. దీని వల్ల 200 మంది మరణించడంతో పాటు 2500 మంది గాయపడ్డారు. నేపాల్ లో 1934లో అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చింది. దాదాపుగా 8.0 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. ఖాట్మాండుతో పాటు భక్తపూర్, పటాన్ నగరాలు దారుణంగా నాశనం అయ్యాయి. తరుచుగా హిమాలయ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుండటంతో హిమాలయాల ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!