Boyapati Srinu: నా భయం అంతా అభిమానుల గురించే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద ‘ఉగ్రరూపం’ చూపించడం ఖాయం. ‘సింహా’, ‘లెజెండ్’లను మించిన విజయాన్ని అందుకున్న‘అఖండ’కి.. సీక్వెల్గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో 3D హంగులతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన తన భయాన్ని కూడా వెల్లడించారు.
Also Read : Allu Arjun : బన్నీ-అట్లీ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఆయన మాట్లాడుతూ.. ‘ఈ విజయం మాకు ఎంత దక్కిన తక్కువ. ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాను. నిజం చెప్పాలంటే, ఈ సినిమా డబ్బుల కోసం చేసింది కాదు. అఖండ భారతం అంటే ఏంటి, మన ధర్మం ఏంటి, దేనికీ లొంగని మన శక్తి ఏంటి? అనే విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం పిల్లలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేశాం. మేము ఎక్కడ మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పకుండా, యువతను సీట్లకు కట్టిపడేసేలా అన్ని వాణిజ్య అంశాలను శక్తిమంతంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ కథను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ఆ సమయంలో నా భయమంతా కేవలం అభిమానుల గురించే! వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ సినిమా చూసిన చాలా మంది థియేటర్లలో లేచి దండం పెడుతున్నారు. ఆ దృశ్యం చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అన్నారు.
ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు 3Dలో చూపించాలని ఆయన కోరారు. అది వారికి చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. మొత్తానికి, ‘అఖండ 2: తాండవం’ కేవలం సినిమాగా కాకుండా, మన సంస్కృతి, ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పే ఒక ప్రయత్నంగా విజయవంతమైందని, ఈ విజయం వెనుక బాలకృష్ణ గారు, అఖండ పాత్ర యొక్క శక్తి కారణమని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!