Covid New Variant: కోవిడ్ కొత్త రూపం.. భారత్కు ముప్పు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
కోవిడ్-19 సోకిన వారిలో రుచి రుచి, వాసన కోల్పోవడం ప్రధాన లక్షణం. అయితే ఈ కొత్త వెరియంట్ బీఏ 2.86 లేదా పిరోలా సోకిన వారిలో అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్క కారటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం ముందుగా ముఖంపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దుద్దుర్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో ఓమిక్రాన్ వెరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
Also Read: Alia Bhatt: రణ్బీర్ ఆలియాను వేధిస్తున్నాడా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
దీంతో ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకే ప్రభుత్వం ముమ్మరం చేసింది. ముఖ్యంగా వృద్దులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై యూకే హెల్త్ సెక్యూరిటీ దృష్టి పెట్టింది. కరోనా టీకా, బూస్టర్ డోస్ తీసుకోని వారు వెంటనే ఈ తీసకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడకుండ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, రద్ది ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనూ మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ బీఏ 2.86 కేసులు గత జూలైలో కనిపించాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!