China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- డ్రాగన్ కొత్త ఎత్తుగడ
- భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- భారత్ను పక్కన పెట్టిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నాలను చైనా మరింత వేగవంతం చేస్తోంది. పశ్చిమాన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా అరేబియా సముద్రానికి చేరుకున్న బీజింగ్.. ఇప్పుడు తూర్పు దిశగా చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ (CMBC) ప్రాజెక్టును తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భారత్కు ఎలాంటి పాత్ర లేకుండా ముందుకు సాగాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ఇటీవల నాలుగు రోజుల చైనా పర్యటన సందర్భంగా ఈ కారిడార్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఈ కారిడార్ను ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు చర్చించినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
చైనాకు చెందిన బంగ్లాదేశ్ రాయబారి యావో వెన్ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ (BCIM) కారిడార్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని చెప్పారు. అయితే కొత్త కారిడార్లో భారత్ చేరాలనుకుంటే స్వాగతమేనని.. దీని ప్రధాన ఉద్దేశం ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక సహకారమేనని పేర్కొన్నారు.
కొత్త కారిడార్ మార్గం ఇదే
ప్రతిపాదిత CMBC కారిడార్ చైనా యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నుంచి ప్రారంభమై మయన్మార్లోని మండలే వరకు చేరుతుంది. అక్కడి నుంచి ఒక మార్గం యాంగోన్, మరో మార్గం రఖైన్ రాష్ట్రంలోని క్యౌక్ఫ్యూ లోతట్టు నౌకాశ్రయం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి రఖైన్ మీదుగా బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ (చట్టోగ్రామ్), కాక్స్ బజార్ ప్రాంతాలకు అనుసంధానం చేయాలనే ప్రణాళికను చైనా సిద్ధం చేస్తోంది. దీని ద్వారా బంగాళాఖాతంలోని చిట్టగాంగ్, మోంగ్లా నౌకాశ్రయాలకు నేరుగా చేరుకోవాలనేది బీజింగ్ లక్ష్యం.
ఈ కారిడార్ వాస్తవానికి 1990లలో ప్రతిపాదించిన బంగ్లాదేశ్-చైనా-భారత్-మయన్మార్ (BCIM) కారిడార్కు కొత్త రూపంగా భావిస్తున్నారు. అప్పట్లో కున్మింగ్ నుంచి మండలే, ఢాకా మీదుగా కోల్కతా వరకు ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)పై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, భారత్-చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2019లో BCIMను అధికారిక BRI జాబితా నుంచి కూడా తొలగించారు.
యుద్ధ ప్రాంతం గుండా కారిడార్
అయితే ఈ ప్రాజెక్టు అమలు అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కారిడార్ మయన్మార్లో అంతర్యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న రఖైన్ రాష్ట్రం గుండా వెళ్తుంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం మయన్మార్లో సైనిక ప్రభుత్వం దేశ భూభాగంలో కేవలం ఐదో వంతు మాత్రమే నియంత్రిస్తోంది. మిగిలిన ప్రాంతాలు తిరుగుబాటు దళాలు, జాతి ఆధారిత సాయుధ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు అమలుపై అనిశ్చితి నెలకొంది.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో శాంతి నెలకొన్న తర్వాతే భూభాగ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
భారత్కు వ్యూహాత్మక సవాలు
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాన CPEC, తూర్పున CMBC ద్వారా చైనా భారత్ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గిల్గిట్-బాల్టిస్థాన్ మీదుగా వెళ్లే CPECను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు బంగాళాఖాతంలో కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నించడం భారత్కు కొత్త సవాల్గా మారే అవకాశముందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తారిఖ్ రెహ్మాన్- జిన్పింగ్ సమావేశంలో తీస్తా నది నిర్వహణ, వరద నియంత్రణ, సాగునీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎకానమీ, డిజిటల్ రంగంలో సహకారం వంటి అంశాలపై కూడా పలు ఒప్పందాలు కుదిరాయి. అలాగే వన్ చైనా పాలసీకి బంగ్లాదేశ్ మరోసారి మద్దతు ప్రకటించింది.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!