Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్..?
- వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చిన బోయింగ్ స్టార్లైనర్..
- అంతరిక్షంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్.. బుచ్ విల్మోర్..
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్.. విల్మోర్లను భూమిపైకి తెచ్చేందుకు నాసా ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boeing Starliner: ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసిపోయింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక భూమిని చేరుకుంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్లో భాగంగా ఈ స్టార్లైనర్ వ్యోమనౌకలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు రావాల్సి ఉండగా.. స్టార్లైనర్లోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం లేట్ అవుతుంది.
Read Also: Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి: సీబీఐ
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇక, సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమేనని చెప్పుకొచ్చింది. కానీ, నాసా అందుకు ఒప్పుకోకపోవడంతో.. స్టార్లైనర్ ఖాళీగా తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో ఈ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాముల కోసం స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను రెడీ చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిందే. స్పెక్స్ క్రూ-9 మిషన్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను నాసా ఐఎస్ఎస్కు పంపించే ఛాన్స్ ఉంది. ఈ సెప్టెంబరులోనే ప్రయోగం ఉండొచ్చని తెలుస్తుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, విల్మోర్ను భూమీ పైకి తీసుకురావాలని నాసా భావిస్తుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!