Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్..?
- వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చిన బోయింగ్ స్టార్లైనర్..
- అంతరిక్షంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్.. బుచ్ విల్మోర్..
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్.. విల్మోర్లను భూమిపైకి తెచ్చేందుకు నాసా ఏర్పాట్లు..
Boeing Starliner: ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసిపోయింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక భూమిని చేరుకుంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్లో భాగంగా ఈ స్టార్లైనర్ వ్యోమనౌకలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు రావాల్సి ఉండగా.. స్టార్లైనర్లోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం లేట్ అవుతుంది.
Read Also: Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి: సీబీఐ
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
ఇక, సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమేనని చెప్పుకొచ్చింది. కానీ, నాసా అందుకు ఒప్పుకోకపోవడంతో.. స్టార్లైనర్ ఖాళీగా తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో ఈ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాముల కోసం స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను రెడీ చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిందే. స్పెక్స్ క్రూ-9 మిషన్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను నాసా ఐఎస్ఎస్కు పంపించే ఛాన్స్ ఉంది. ఈ సెప్టెంబరులోనే ప్రయోగం ఉండొచ్చని తెలుస్తుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, విల్మోర్ను భూమీ పైకి తీసుకురావాలని నాసా భావిస్తుంది.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!