Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి: సీబీఐ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు..
- ఎక్సైజ్ పాలసీలో జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామిగా ఉన్నారు..
- సీబీఐ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తు ముగిసింది. తమ విచారణలో కీలక విషయాలను ఛార్జిషీట్లో పొందపర్చింది. దానిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలు చేయడం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. సీబీఐ చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.
Read Also: Haryana Assembly Elections: హర్యానా కాంగ్రెస్లో తిరుగుబాటు.. గుడ్ బై చెప్పిన సీనియ్ నేత..!
Also Read
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ఇక, ఎక్సైజ్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా వ్యవహరించారు.. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలుచేయడం వరకు ఢిల్లీ సీఎం ప్రమేయం ఉంది.. ఆ మద్యం విధానం వల్ల తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని అతడు డిమాండ్ చేశాడని సీబీఐ పొందుపర్చిన ఛార్జ్ షీట్ లో పేర్కొనింది. అందుకోసం అతని సన్నిహిత సహచరుడు, ఆప్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ ఈ వ్యాపారంలో వివిధ వాటాదారులను సంప్రదించినట్లు తెలిపింది. అలాగే, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
Read Also: టాప్ సీక్రెట్.. బార్ లో సాల్ట్ పల్లీలు ఎందుకు సర్వ్ చేస్తారో తెలుసా..?
అయితే, ఈ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బున్ని.. హవాలా మార్గంలో తరలించారు. మరో ఇద్దరు నిందితులు వినోద్ చౌహాన్, ఆశిశ్ మాథుర్ ద్వారా అక్రమంగా గోవాకు పంపించారనే విషయం దర్యాప్తులో తేలిందని సీబీఐ చెప్పుకొచ్చింది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ధనాన్ని ఆప్ వాడుకుందుని చెప్పుకొచ్చింది. ఈ నేరపూరిత కుట్ర కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపణలు చేసింది. ఇక, సీబీఐ చేసిన వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
Read Also: CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..
అలాగే, మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. దీనిపై న్యాయస్థానం సెప్టెంబరు 10వ తేదీన తీర్పు వెల్లడించనుంది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లోనే ఉండబోతున్నారు.
తాజావార్తలు
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!