Nawaz Sharif: అణు పరీక్ష ఆపడానికి బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశాడు.. భారత్కి తగిన జవాబు ఇచ్చాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులోని లాహోర్కి భారీ ర్యాలీ నడుమ వచ్చారు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశించి ర్యాలీలో ప్రసంగించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.
చాలా ఏళ్ల తరువాత నేను మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని, మీతో నా బంధం అలాగే ఉందని, దీనికి గర్వపడుతున్నానని నవాజ్ షరీఫ్ అన్నారు. 1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. నాకు కూడా 1 బిలియన్ డాలర్ ఆఫర్ చేయవచ్చేమో, కానీ నేను పాకిస్తాన్ భూమిలో పుట్టాను, అలాంటి పనులు చేయలేదని తెలిపారు.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Read Also: Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..
నా స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే, అమెరికా అధ్యక్షుడి ముందు తలవంచేవారని అన్నారు. మేము అణు పరీక్ష నిర్వహించాము, అణు పరీక్షలు నిర్వహించిన భారతదేశానికి తగిన జవాబు ఇచ్చామనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. దాదాపు గంటపాటు ఆయన మాట్లాడారు. ఇవన్నీ చేసినందుకు మనం శిక్షించబడతామా..? అని ప్రజలను ప్రశ్నించారు. తన మద్దతుదారులకు ద్రోహం చేయలేదని, ఎలాంటి త్యాగాలకు వెనుకడుగు వేయలేదని నవాజ్ షరీఫ్ అన్నారు. తనపై, తన కూతురుపై , పార్టీ నేతలపై అబద్దపు కేసులు బనాయించారని గుర్తు చేశారు.
నవాజ్ షరీఫ్ ను దేశం నుంచి వేరు చేసింది ఎవరో చెప్పండి..? పాకిస్తాన్ నిర్మించింది మనమే, పాకిస్తాన్ ను అణుశక్తిగా మార్చింది మనమే అని ఆయన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉందని, పాకిస్తాన్ ని అభివృద్ధి పథంలోకి మళ్లీస్తానని ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..