Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
- ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ముదిరిన ఘర్షణ..
- మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు..
- యుద్ధ నేపథ్యంలో కొడుకు పెళ్లి వాయిదా వేసిన ఇజ్రాయిల్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్ని ఎలిమినేట్ చేసింది. ఇదే కాకుండా ఇరన్ అణు శాస్త్రవేత్తలను చంపేసింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్ టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలే లక్ష్యంగా వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.
Read Also: Yanamala Rama Krishnudu: గతంలో నిద్రపోయారా..? సోకాల్డ్ సంపాదకులపై యనమల ఫైర్..!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రంగా మారడం, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తన కుమారుడి పెళ్లిని వాయిదా వేస్తుకున్నారు. నెతన్యాహూ కుమారుడు అవ్నర్ నెతన్యాహూ సోమవారం తన భాగస్వామి అమిత్ యార్దేనిని వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, ఇజ్రాయిల్ బందీలు ఇప్పటికీ గాజాలో ఉండగా, నెతన్యాహూ కుటుంబం వేడుకలు జరుపుకోవడంపై కొందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వివాహం వివాదానికి దారి తీసింది. టెల్ అవీవ్కు ఉత్తరాన ఉన్న కిబ్బట్జ్ యాకుమ్లోని ఉన్నత స్థాయి రోనిట్స్ ఫామ్ ఈవెంట్ హాల్లో వివాహ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారని ముందుగా అనుకున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే కుమారుడి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, నెతన్యాహు కుటుంబం మెగా వేడుకలకు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై పెద్ద దాడిని ప్రారంభించింది, అణు స్థావరాలు, సైనిక సౌకర్యాలు, క్షిపణి స్థావరాలు మరియు ఇస్లామిక్ రిపబ్లిక్లోని సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతీకారంగా జరిపిన దాడుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!