Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్పై రష్యా దాడి.. 49 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.
రష్యా సరిహద్దుల్లో ఉన్న కుపియాన్స్క్ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ రాకెట్ దాడి జరిగిందని, గతంలో ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందని, ఆ తరువాత ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే రష్యా దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. ఒక సాధారణ దుకాణంపై రాకెట్ దాడి చేసి ప్రజలను చేయడం రష్యా చేసిన ఉగ్రవాద దాడి అని విమర్శించారు.
Also Read
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26 వేల మంది మిస్సింగ్..
గ్రోజా గ్రామంలో కేఫ్, గ్రాసరీ దుకాణంపై దాడి జరిగినట్లు ఖార్కివ్ ప్రాంత చీఫ్ ఒలేగ్ సినెగుబోవ్ తెలిపారు. దాడి జరిగి గ్రామం కుపియాన్స్క్ కి పశ్చిమా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో 500 మంది జనాభా ఉన్నట్లు అంచనా. దాడిలో చనిపోయిన 49 మందిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరో చిన్నారి గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, యూకే లాంటి వెస్ట్రన్ దేశాల సహాయంతో ఉక్రెయిన్, రష్యాకు ఎదురొడ్ది పోరాడుతోంది. రష్యా ముందు ఎంతో చిన్నదైన ఉక్రెయిన్ కొన్ని వారల్లోనే లొంగిపోతుందని అంతా భావించినా, ఏడాదిన్నర కాలంగా యుద్ధం జరుగుతూనే ఉంది. పలుమార్లు చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది, అయితే ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించుకున్న జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను చర్చల్లోకి తీసుకురావద్దని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!