Census: 2025 నుంచి జనాభా లెక్కల సేకరణ.. డీలిమిటేషన్పై కేంద్రం సిద్ధం..
- 2025 నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు ప్రారంభం..
- 2028 నాటికి ఎంపీ స్థానాల డీలిమిటేషన్..
- కుల గణనపై రాని క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
వచ్చే ఏడాది జనాభా గణనలో మతం, సామాజిక తరగతుల వారిగా సాధారణ వర్గకరణతో పాటు జనరల్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణన, జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గాల్లోని ఉప వర్గాల సర్వేలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, 2028 నాటికి ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Stock market: వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
జనాభా లెక్కల గురించి వివరాలు వెల్లడైన నేపథ్యంలో ప్రతిపక్షాలు కులగణపై చర్చను లేవనెత్తాయి. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ల గణన, లోక్సభ డీలిమిటేషన్కు సంబంధించిన విషయాలను స్పష్టం చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కేంద్రాన్ని కోరారు. జైరాం రమేష్ మాట్లాడుతూ.. రెండు కీలక విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందా..? కుటుంబ నియంత్రణలో అగ్రగామి ఉన్న రాష్ట్రాలపై లోక్సభ పునర్విభజన ప్రతికూలతగా మారుతుందా..? అని ప్రశ్నించారు. కుల గణనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ అన్నారు.
నిజానికి 2021లో జనాభా గణన ప్రారంభించాల్సి ఉన్నా, కోవిడ్ పాండిమిక్ వల్ల వాయిదా పడింది. నాలుగేళ్లు ఆలస్యంగా కుల గణన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ యొక్క సెంట్రల్ డిప్యుటేషన్ ఇటీవల ఆగస్టు 2026 వరకు పొడిగించబడింది. దీంతో జనాభా గణన త్వరలో ప్రారంభమవుతుందని కేంద్రం మెసేజ్ ఇచ్చినట్లు అయింది. గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 121 కోట్లకు పైగా జనాభా నమోదైంది, ఇది 17.7 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది.
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!