Afghanistan: దేశం విడిచిపెట్టిన హిందువులు, సిక్కులు తిరిగి రావాలంటున్న తాలిబన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban Urge Hindus, Sikhs To Return: ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన మైనారిటీలైన హిందువులు, సిక్కులు తిరగి ఆప్ఘాన్ కు రావాలని తాలిబన్లు కోరుతున్నారు. దేశంలో భద్రతాపరమైన అంశాలు పరిష్కరించబడ్డాయని.. తమ మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు తిరిగి దేశానికి రావాలని కోరారు. తాలిబన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందు, సిక్కు కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. భద్రతా కారణాల వల్ల దేశాన్ని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగా రావచ్చని కోరారు.
కాబూల్ లో గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ దాడిని అడ్డుకున్నందుకు సిక్కు ప్రతినిధులు తాలిబన్ నాయకులకు ధన్యవాదాాలు తెలిపారు. జూన్ 18న కాబూల్ లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సిక్కుతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో గురుద్వారాలో 30 మంది వరకు ఉన్నారు. అయితే తాలిబన్ భద్రతా దళాలు పెద్దగా ప్రాణనష్టం జరగకుండా దాడిని అడ్డుకున్నారు.
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
Read Also: Canada: కెనడాలో కాల్పులు.. ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తుల మృతి
ఆప్ఘనిస్తాన్ లో సిక్కులు, హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా వారు అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఐఎస్ ఉగ్రవాదులు మైనారిటీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గతంలో 2020 మార్చిలో కాబూల్ లోని శ్రీ గురు హర్ రాయ్ సాహిబ్ గురుద్వారాపై దాడి జరిగింది. ఆ దాడిలో 27 మంది సిక్కలు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ ఘటనల తరువాత చాలా మంది హిందువుల, సిక్కులు ఇండియాకు వచ్చారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!