Rohingya refugees: సముద్రం నుంచి సముద్రంలోకి.. రోహింగ్యాలను వెనక్కి పంపిన ఇండోనేషియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohingya refugees: మయన్మార్లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునేలోపే అలసటతో కుప్పకూలారు. అయితే శరణార్థులతో కూడిన పడవను అక్కడి స్థానికులు మళ్లీ సముద్రంలోకే పంపించారు. గురువారం అర్థరాత్రి సముద్రంలోకి పంపినట్లు స్థానికులు వెల్లడించారు.
Read Also: Harish Rao : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్సే
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
మూడు వారాల క్రితం బంగ్లాదేశ్ నుంచి ఈ పడవ బయలుదేరినట్లు చెబుతున్నారు. అయితే అది ఇండోనేషియాలోని అచే సముద్ర తీరంలో ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. మలేషియా, ఇండోనేషియా చేరుకోవడానికి ప్రతీ ఏడాది వేల సంఖ్యలో రోహింగ్యాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో ప్రయాణిస్తున్నారు. నాసిరకం పడవల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే మేము రోహింగ్యాలతో విసిగిపోయామని, ఇక్కడికి వచ్చిన రోహింగ్యాల్లో కొందరు పారిపోయారని, కొందరు ఏజెంట్లు వారిని ఎత్తుకెళ్లారని, ఇది మానవ అక్రమ రవాణా అని నార్త్ అచేలోని కమ్యూనిటీ నాయకుడు సైఫుల్ అఫ్వాడీ అన్నారు.
రోహింగ్యాల హక్కుల సంస్థ అరకాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ క్రిస్ లేవా మాట్లాడుతూ.. శరణార్థులకు వసతి కల్పించడానికి స్థానిక ప్రభుత్వ వనరులు లేకపోవడం, వారిని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే భావనతో గ్రామస్తులు వీరిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. రోహింగ్యా స్మగ్లర్లు ఇండోనేషియాను మలేషియాలోకి వెళ్లేందుకు ఉపయోగించుకుంటున్నారని, ఏ ఇతర దేశం కూడా వారిని లోనికి అనుమతించడం లేదని తెలిపారు. ప్రస్తుతం పడవను తిప్పిపంపిన తర్వాత ఎక్కడికి వెళ్లిందో తెలియదని లేవా చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!