Pakistan Train Accident: పాకిస్థాన్ రైలు ప్రమాదంలో 30కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Train Accident: పాకిస్థాన్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరింది. షాజాద్పూర్ – నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్లోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. షాజాద్పూర్ మరియు నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్కు చెందిన పది కోచ్లు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను నిలిపివేశారు. రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని నవాబ్షాలోని పీపుల్స్ మెడికల్ హాస్పిటల్కు తరలించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Read also: Priya Prakash Varrier : మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతున్న మలయాళీ భామ..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
సహారా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 10 కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ రెహమాన్ మీడియాకు తెలిపారు. అయితే ఇంకా పూర్తి సమాచారం రావాల్సిఉందన్నారు. ప్రమాదం జరిగిన బోగీల నుండి ప్రయాణికులను తరలించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రైల్వే, విమానయాన శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 15 మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ప్రమాదం చాలా బాధాకరం. ప్రస్తుతం బాధిత ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధమ కర్తవ్యమని మంత్రి ప్రకటించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని నవాబ్షా డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!