Pakistan: పాక్లో దారుణం.. బార్బర్స్ని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన టెర్రరిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
Read Also: Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..
Also Read
- POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ఇదిలా ఉంటే తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఆరుగురు బార్బర్స్ని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని మీర్ అలీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియా మంగళవారం నివేదించింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్కి చెందిన బాధితులు స్థానిక బజార్లో కటింగ్ షాప్స్ నడుపుతున్నారు. సోమవారం వీరిని కిడ్నాప్ చేసి చంపేశారు, మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ హత్యలకు ఎవరు బాధ్యులనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలోనే ఐదుగురు కూలీలను మిలిటెంట్లు చంపేశారు. పాకిస్తాన్లో ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో వరసగా ఉగ్రదాడులు అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) థింక్ ట్యాంక్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో నవంబర్లో 51 ఉగ్రదాడులు జరిగితే 54 మంది మరణించగా.. 81 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!