Pakistan: పాక్లో దారుణం.. బార్బర్స్ని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన టెర్రరిస్టులు..
Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
Read Also: Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..
Also Read
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
ఇదిలా ఉంటే తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఆరుగురు బార్బర్స్ని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని మీర్ అలీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియా మంగళవారం నివేదించింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్కి చెందిన బాధితులు స్థానిక బజార్లో కటింగ్ షాప్స్ నడుపుతున్నారు. సోమవారం వీరిని కిడ్నాప్ చేసి చంపేశారు, మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ హత్యలకు ఎవరు బాధ్యులనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలోనే ఐదుగురు కూలీలను మిలిటెంట్లు చంపేశారు. పాకిస్తాన్లో ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో వరసగా ఉగ్రదాడులు అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) థింక్ ట్యాంక్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో నవంబర్లో 51 ఉగ్రదాడులు జరిగితే 54 మంది మరణించగా.. 81 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!