Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మంగళవారం ఆరోపించింది. ఈ అరెస్టును హిందువులపై వేటగా అభివర్ణించింది.
‘‘కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హిందూ కార్యకర్తలను అవమానకరంగా లక్ష్యంగా చేసుకుంటుంది. కరసేవక్ శ్రీకాంత్ పూజారిని 31 ఏళ్ల నాటి నకిలీ కేసులో అరెస్ట్ చేసింది. హిందువులు రామమందిరాన్ని జరుపుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ పిరికిచర్య రామమందిరంపై వాస్తవాన్ని అంగీకరించానికి నిరాకరిస్తుంది. హిందువులపై జరుగుతున్న ఈ వేటని ఖండిస్తున్నాము’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: JN.1 Cases: దేశవ్యాప్తంగా 263 కోవిడ్ JN.1 కేసులు.. ఒక్కరాష్ట్రంలోనే సగం కేసులు..
1992లో బాబ్రీ మసీదు కూల్చేవేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన అల్లర్లలో 50 ఏళ్ల వ్యక్తి శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని హుబ్బళ్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాబ్రీ ఘటన సమయంలో అతనికి 20 ఏళ్లు. అయితే ఈ అరెస్టుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఇది రాజకీయ ద్వేషం కానది, నేరానికి పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవడమే అని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాం.. నేరం చేసిన వ్యక్తి వదిలేద్దామా..? అని సీఎం ప్రశ్నించారు.
పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసని, 2006 నుంచి ఈ కేసు పెండింగ్లో ఉందని, గత మూడు నెలల్లో ఇలాంటి 37 కేసుల్ని ఛేదించామని, ఇది అందులో ఒకటని, బాబ్రీ కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లలో పూజారి పాల్గొన్నాడని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
-
Toxic: యష్ ఇచ్చిన హింట్తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
-
E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?