Pakistan: పాకిస్తాన్లో గూడ్స్ రైల్ని ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
మియాన్వాలి నుంచి లాహోర్ వెల్లే ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఉన్న అదే ట్రాకులోకి రావడంతో ప్రమాదం జరినట్లు జియో న్యూస్ నివేదించింది. ట్రాకులో ఉన్న గూడ్సు రైలును చూసిన ప్యాసింజర్ రైలు డ్రైవర్, రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు గాయపడినట్లు, అందులో ఐదుగురు ప్రయాణికులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ప్రధాన మంత్రి అవుతారు.. జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు..
ప్రమాదం జరిగిన లాహోర్ డివిజన్ లో రైలు కార్యకలాపాలు సజావుగా నడుస్తున్నాయని అక్కడి రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం తరువాత ట్రాకును క్లియర్ చేశారు. రైలు డ్రైవర్ ఇమ్రాన్ సర్వర్ మరియు అతని సహాయకుడు ముహమ్మద్ బిలాల్తో సహా నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ రైల్వే తెలిపింది. దీనిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు, 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.
బ్రిటీష్ వారు వేసిన పట్టాలపైనే ఇప్పటికీ పాకిస్తాన్ రైల్వే నడుస్తోంది. ఆ దేశంలో రైలు వ్యవస్థ విద్యుదీకరించలేదు. పాకిస్తాన్ లో రైలు ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. తరుచుగా రైళ్లు పట్టాలు తప్పడం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టులో కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలో నవాబ్ షా జిల్లాలో సహారా రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 56 మంది మరణించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!