Pakistan: పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.