Bangladesh: బంగ్లాదేశ్లో రోడ్డెక్కిన 30 వేల మంది హిందువులు..
- బంగ్లాదేశ్ లో హిందూ సంఘాల ఆందోళన..
- తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువుల నిరసన..
- ఛాటోగ్రామ్ లోని రోడ్డుపై 30 వేల మంది హిందువుల భారీ ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా హింస చెలరేగుతుంది. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ హిందువులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువులు రోడ్డు మీదకు వచ్చారు. ఏకంగా 30 వేల మంది భారీ ర్యాలీ తీశారు. తమకు రక్షణ కల్పించాలని మధ్యంతర సర్కార్ కి విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ర్యాలీ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also: Donald Trump: అధికారంలోకి వస్తే వాటి ధరలను తగ్గిస్తా
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
అయితే, ప్రజల్లో వ్యతిరేకత, విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయింది. ఆ తర్వాత తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక సర్కార్ ఏర్పడింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు యూనస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా కొనసాగుతారని అక్కడి సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు ఆగిపోయాయి. అయితే, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై దాడులు క్రమంగా పెరిగిపోయాయి. గత ఆగస్టు నుంచి వేలాది మంది హిందువులపై దాడులు, దోపిడీ ఇతరత్రా అకృత్యాలు కొనసాగుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల హిందువులు ర్యాలీలు, నిరసనలకు దిగుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!