Bangladesh Violence: షేక్ హసీనా రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- షేక్ హసీనా గద్దె దిగినా బంగ్లాదేశ్లో ఆగని హింస..
- రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- హిందువులు.. అవామీ లీగ్ నేతలే టార్గెట్గా హత్యలు..
- రిజర్వేషన్ కోటా అల్లర్లలో మొత్తంగా 560 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది. నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ప్రధాని కాబోతున్నారు. ఇదిలా ఉంటే, షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినా అక్కడ హింసాకాండ ఆగలేదు. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులతో పాటు అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. చాలా ప్రాంతాల్లో దేవాలయాలను తగలబెట్టడంతో పాటు హిందూ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.
Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
హసీనా రాజీనామా చేసిన తర్వాత ఏకంగా 232 మంది హింసలో మరణించారని గురువారం మీడియా నివేదికలు చెప్పాయి. మొత్తంగా ఈ రిజర్వేషన్ల ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 560కి చేరుకుంది. హసీనా పదవిలో ఉన్న సమయంలో అంటే జూలై 16 నుంచి ఆగస్టు 04 మధ్య 329 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం రోజే వందల్లో మరణాలు సంభవించాయి. గాజీపూర్లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
పోలీసుల్ని ఆందోళనకారులు టార్గెట్ చేసి హత్యలు చేస్తుండటంతో పలువురు పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరేందుకు భయపడుతున్నారు. ఈ మేరకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీస్ ప్రధాన కార్యాలయం కోరింది. బుధవారం కొత్తగా నియమితులైన ఇన్స్పెక్టర్ జనరల్ మైనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా ఢాకాతో పాటు పలు నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ని విద్యార్థులే నియంత్రిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతలు పారిపోకుండా చూస్తున్నారు. రాజ్షాహి సిటీ కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ మరియు రాజ్షాహి మెట్రోపాలిటన్ అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ రజబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకీర్ హొస్సేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సరిహద్దు గార్డ్ బంగ్లాదేశ్ (BGB) చుడంగాలోని దర్శన ICP చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!