Ukraine Crisis: రష్యా దాడుల్లో 10 వేల మంది మృతి.. ఉక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Crisis: రష్యా దాడుల్లో 10 వేల మంది ఉక్రెయిన్ వాసులు మృతి చెందారు. ఇప్పటికీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా సేనలు చేసిన 98 వేల యుద్ధ నేరాలను నమోదు చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో సుమారు 10 వేల మంది మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 499 మంది పిల్లలు ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి యూరియ్ బెల్సోవ్ తెలిపారు. ఉక్రెయిన్ భూభాగాలను తమ సేనలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఉక్రెయిన్లో చేసిన 98 వేల యుద్ధ నేరాలను తమ విభాగం నమోదు చేసిందని యూరియ్ తెలిపారు. ‘‘ గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్పై చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 10,749 మంది మరణించారు. 15,599 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క మరియుపోల్లోనే 10 వేల మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్లో మరణాలపై ఐక్యరాజ్య సమితి సైతం ఒక నివేదిక విడుదల చేసింది. రష్యా దాడుల్లో 500 మంది పిల్లలు సహా సుమారు 9 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెంది ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్కు చెందిన ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. బుధవారం ఉక్రెయిన్ నౌకాశ్రయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్ -రొమేనియా సరిహద్దులోని ఇజ్మాయెల్ దగ్గర డాన్యూబ్ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- 000 People
- 10
- attacks
- died
- Russia
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..