Khammam Murder Case: యూట్యూబ్లో చూసి మర్డర్ చేయడం నేర్చుకున్నారు! వెలుగులోకి సంచలన నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Murder Case: ఖమ్మం జిల్లా కామేపల్లి మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. మర్డర్ చేయడం.. ఆ తర్వాత ఆనవాళ్లను చెరిపేయడం.. డెడ్ బాడీని మాయం చేయడం లాంటి వాటిని నిందితులు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఎందుకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చంపారు? కేవలం బంగారం కోసమే హత్య చేశారా?
READ ALSO: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని వార్నింగ్
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ఖమ్మం జిల్లా కామేపల్లిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సెప్టెంబర్ 22న అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఐతే ఈ మిస్సింగ్ కేసు తర్వాత ఖమ్మం రూరల్ పరిధిలో పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన తల, చేతులు లభించాయి. వాటిని కుటుంబ సభ్యులకు చూపించి.. వెంకటేశ్వర్లు శరీర భాగాలుగా గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా.. మర్టర్ కేసుగా మారింది…
3 తులాల బంగారం కోసం హత్య
ఇక ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు అశోక్ను గుర్తించారు. పలు సాంకేతిక ఆధారాలతో ఓ నిర్ధారణకు వచ్చారు. నిజానికి వెంకటేశ్వర్లు, అశోక్ ఇద్దరూ స్వలింగ సంపర్కులు. ఈ విషయం కోసమే అశోక్ రూమ్కు వెంకటేశ్వర్లు వెళ్లినట్లు ధృవీకరించుకున్నారు పోలీసులు. ఐతే ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నగ్మాతో కలిసి వెంకటేశ్వర్లును అశోక్ హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కేవలం 3 తులాల బంగారం కోసం హత్య జరిగిందంటున్నారు…
అశోక్ ఇచ్చిన బంగారు గొలుసును విక్రయించిన నగ్మా
వెంకటేశ్వర్లు హత్యలో నగ్మా పూర్తి పాత్ర ఉందంటున్నారు పోలీసులు. హత్య చేసే సమయంలో ఆమె కూడా రూంలోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఎవరూ రాకుండా చూస్తూ.. అశోక్ ఇచ్చిన బంగారు గొలుసును కూడా నగ్మానే విక్రయించిందని చెబుతున్నారు… ఇక ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు సంబంధించి శబ్దం రాకుండా ఎలా చంపాలో యూట్యూబ్లో వెతికి హత్య చేశారు. వెంకటేశ్వర్లు శరీర భాగాలను వేరు చేసేందుకు యూట్యూబ్లో చూసి కత్తులు కొనుగోలు చేశారు. శరీర భాగాలను అత్యంత కిరాతకంగా వేరు చేసి శరీర భాగాలను వేరు వేరు ప్రాంతాలలో పారేశారు. వెంకటేశ్వర్లు హత్య కేసులో అశోక్తో పాటు నగ్మాపైనా కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.. మరోవైపు వెంకటేశ్వర్లు మొండెం ఎక్కడ పడేశారనేది మిస్టరీగానే ఉంది. దీంతో పోలీసుల తీరును కుటుంబ సభ్యులు తప్పు పడుతున్నారు. వారు కేసును సీరియస్గా తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..
READ ALSO: Netanyahu Trump AI Photo: ఏఐ మ్యానియా.. ట్రంప్కు నెతన్యాహు నోబెల్ ప్రదానం..
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!