Uttar Pradesh: గన్ తో బెదిరించి మహిళా సిబ్బందిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు బలవంతం చేస్తుంటే సూపర్ వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తి నేరానికి సహకరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Killer Plant Fungus: కోల్కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
పోలీస్ అధికారి హేమ్ రాజ్ మీనా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న మాల్ లో దుస్తులు మార్చుకునే గదిలో డ్రెస్ మార్చుకుంటుండగా, సెక్యూరిటీ గార్డు గదిలోకి బలవంతంగా ప్రవేశించి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో మాల్ సూపర్ వైజర్, హౌజ్ కీపర్ నిందితుడికి మద్దతుగా బయట గది తలుపు వెలపల నిలబడి ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని మహిళ పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు బాధిత మహిళ మాల్ లో ఉద్యోగం మానేసింది. అయితే ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు. అత్యాచార బాధితులరాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఘటన ఇలా ఉంటే.. కొన్ని రోజలు క్రితం బెంగళూర్ లో ఓ మహిళ పార్కులో ఉండగా, నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వేగం వెళ్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ రోజే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు హెచ్చరించడంతో కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..