AP Crime: కిల్లర్ సిస్టర్.. ఆస్తి కోసం అనుబంధాన్ని మరచి.. అన్న, తమ్ముడి హత్య..!
- గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీ..
- క్రైం థ్రిల్లర్ను తలపించిన కేసులో సోదరి ప్రధాన నిందితురాలు..
- తండ్రి సంపాదించిన ఆస్తి కోసం.. అన్నదమ్ముళ్ల హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం థ్రిల్లర్ను తలపించిన ఈ కేసును సోదరి ప్రధాన నిందితురాలిగా తేల్చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం…అన్నదమ్ముళ్లను సొదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముళ్లు, చెల్లెలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వాటాలు కుదరకపోవడంతో…చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న సోదరి కృష్ణవేణి…తనకు అడ్డుగా ఉన్న గోపికృష్ణ, రామకృష్ణలను…అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇద్దర్ని చంపేస్తే…తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించింది. ముగ్గురి ఆస్తిని తానే అనుభవించవచ్చని లెక్కలు వేసుకుంది.
Read Also: Bihar: ప్రశాంత్ కిషోర్ పార్టీలో తిరుగుబాటు.. ఇద్దరు మాజీ ఎంపీల రాజీనామా
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
అన్నదమ్ముళ్లను చంపేయాలని ప్లాన్ వేసిన కృష్ణవేణి…ఇద్దర్ని ఒకేసారి చంపేస్తే ఇబ్బందులు వస్తాయని అనుకుంది. ఒక్కొక్కర్ని ఒక్కోసారి చంపేయాలని వ్యూహాలను అమలు చేసింది. మొదట తమ్ముడు రామకృష్ణకు మద్యం తాగించింది. మత్తులోకి జారుకోగానే…ఇంట్లోనేచున్నితో గొంతు బిగించి హత్య చేసింది. శవం దొరికితే పోలీసులకు చిక్కుతానన్న భయంతో…డెడ్బాడీ దొరకుండా కెనాల్లో పడేసింది. తమ్ముడ్ని చంపేసిన కృష్ణవేణి…అన్న గోపికృష్ణ హత్యకు పథకం వేసింది. విభేదాలను పక్కన పెట్టి…ప్రేమగా నటించింది. సోదరుడికి నిద్రమాత్రలు ఇచ్చి…చంపేసింది. సోదరులను చంపేయడానికి ఇద్దరు మైనర్ల సాయం తీసుకుంది. పల్నాడు జిల్లా నకరికల్లు చెందిన పౌల్రాజ్… ప్రభుత్వ టీచరుగా పని చేశాడు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి ముగ్గురు సంతానం. గోపికృష్ణ, కృష్ణవేణి, రామకృష్ణ. ఈమె భర్తతో తెగదెంపులు చేసుకొని…ఊర్లోనే ఉంటుంది. తండ్రి మృతి తర్వాత…వీరి మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తండ్రికి సంబంధించిన ఆస్తులు తమకే దక్కాలని ఎవరికి వారు వాదించుకుంటున్నారు. ఒక ఇల్లు చిన్న కొడుకు రామకృష్ణకు దక్కింది. మరో ఇల్లు, తండ్రి పెన్షన్ కూతురు రావడం లేదు. దీంతో కృష్ణవేణి…ఆగ్రహంతో రగిలిపోయింది. చెల్లెలును చంపేసి…ఇద్దరు ఆస్తిని పంచుకోవాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేసుకున్నారు. అయితే అదును చూసి అన్నదమ్ములు లెక్క తేల్చేసింది కృష్ణవేణి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఆస్తి కోసం గొడవకి వస్తున్న అన్నను, తమ్ముడిని…అడ్డు తొలగించుకున్నట్లు ఊర్లో వారికి చెప్పుకుంది కృష్ణవేణి. అందుకే నవంబర్ 26 నుంచి తమ్ముడు రామకృష్ణ, ఈ నెల 10 నుంచి అన్న గోపికృష్ణ కనిపించకుండా పోయారని తెలిసిన వారికి చెప్పింది. ఇది ఆ నోట ఈ నోట పాకి చివరకు పోలీసుల చేరింది. దీనిపై కృష్ణవేణిని ప్రశ్నించిన పోలీసులకు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన తమ్ముడిని, అన్నను తానే లేపేశానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. మద్యం తాగించి, గొంతు బిగించి చంపడంతో షాకయ్యారు. ఆమె మాటలు నమ్మలా వద్దా అని ముందు వెనుకా ఆలోచించారు. మద్యం మత్తులో కృష్ణవేణి నిజం చెబుతుందో…అబద్ధం చెప్తుందో తెలియక అయోమయంలో పడ్డారు. కృష్ణవేణి చెప్తున్నట్లుగా నిజంగా హాత్య చేసిందా లేదంటే…ఇంకేమైనా జరిగి ఉంటుందా అని అనుమానించారు. అదృశ్యం అయిపోయిన ఇద్దరు సోదరులు, వాళ్ళ కుటుంబాలతో గొడవపడి తెగ తెంపులు చేసుకొన్నారు. తల్లి లేదు, తండ్రి లేడు, కేసు పెట్టే వాళ్ళు లేరు. డెడ్ బాడీ లు దొరకలేదు. నకిరేకల్లు డబల్ మర్డర్ కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు… నిందితురాలు కృష్ణవేణి, ఆమె ప్రియుడు దానయ్యతోపాటు మరో నలుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల మృతదేహాల కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు…రెండు రోజుల క్రితం ముప్పాళ్ళ ప్రాంతంలోని మేజర్ కెనాల్లో ఓ డెడ్బాడీ దొరికింది. ఇది కానిస్టేబుల్గా పని చేసిన గోపికృష్ణదిగా అనుమానించారు. గోరంట్ల మేజర్ కెనాల్లో రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. ఇద్దరి డెడ్బాడీలకు డీఎన్ఏ టెస్టులు చేసి…వారిని గోపికృష్ణ, రామకృష్ణగా పోలీసులు నిర్దారించారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!