గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం థ్రిల్లర్ను తలపించిన ఈ కేసును సోదరి ప్రధాన నిందితురాలిగా తేల్చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం...అన్నదమ్ముళ్లను సొదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముళ్లు, చెల్లెలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వాటాలు కుదరకపోవడంతో...చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేశారు.