Extramarital affair: “లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ”.. కొడుకు సాక్ష్యంతో వెలుగులోకి నేరం..
- లవర్ సాయంతో భర్తను చంపిన మహిళ..
- 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో దారుణం వెలుగులోకి..
- సంచలనంగా రాజస్థాన్ అల్వార్ మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital affair: లవర్తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు చెప్పుకొచ్చింది. అయితే, వీరి కుమారుడు పోలీసులకు సంఘటన గురించి వివరించాడు. 48 గంటల్లోనే అసలు నిందితులు ఎవరనేది తెలిసింది.
బాలుడు చెబుతున్న దాని ప్రకారం, అతడి తల్లి ఆ రాత్రి ఉద్దేశపూర్వకంగానే ఇంటి ప్రధాన గేట్లను తెరించింది. అర్థరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఈ నలుగురితో పాటు అనిత లవర్ కాశీరాం ప్రజాపత్ కూడా ఉన్నాడు. బాలుడు ఇతడిని ‘‘కాశీ అంకుల్’’ అని పిలుస్తాడు. వీరు మాన్ సింగ్ నిద్రలో ఉండగా, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ సమయంలో తాను ఈ హత్యను చూసినట్లు బాలుడు వెల్లడించాడు.
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
Read Also: Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
“నేను ఇప్పుడే నిద్రలోకి జారుకున్నప్పుడు తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా తల్లి గేటు తెరవడం చూశాను. కాశీ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేను భయపడ్డాను, నేను లేవలేదు, నేను నిశ్శబ్దంగా అంతా చూడటం ప్రారంభించాను. వారు మా గదికి వచ్చారు. నా తల్లి మంచం ముందు నిలబడి ఉండటం చూశాను. ఆ వ్యక్తులు అతనిని కొట్టారు, అతని కాళ్ళను పట్టుకుని, గొంతు నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిని దిండుతో అదిమాడు. నేను నా తండ్రి కోసం చేయి చాపినప్పుడు కాశీ అంకుల్ నన్ను తన ఒడిలో ఎత్తుకుని తిట్టి బెదిరించాడు,” అని బాలుడు చెప్పాడు. భయంతో నేను మౌనంగా ఉన్నానని, కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయారని, ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయినట్లు చెప్పాడు.
పోలీసులు దర్యాప్తులో అనిత, కాశీరాం మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఖేర్లిలో అనిత ఒక చిన్న జనరల్ స్టోర్ నడుపుతోంది, ఇదే సమయంలో స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం అనే వీధి వ్యాపారితో పరిచయమైంది. కాలక్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అనిత, కాశీరామ్ కలిసి నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్కి రూ. 2 లక్షలు హత్య కోసం ఆఫర్ చేశారు.
ముందుగా, బంధువులకు మాన్ సింగ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు చెప్పింది. అయితే, అతడి ఒంటిపై గాయాలు, విరిగిన పళ్లు వంటి గుర్తులు కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైద్య పరీక్షల్లో హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో అనిత , కాశీరామ్, కాంట్రాక్ట్ కిల్లర్స్లో ఒకరైన బ్రిజేష్ జాతవ్ అను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Ranabali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!