Extramarital Affair: పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband In Ghatkesar For Extramarital Affair: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్ని కూల్చడమే కాదు, మనుషుల చేత హత్యలు కూడా చేయిస్తున్నాయి. కలకాలం కలిసుందామని ప్రతిజ్ఞ చేసిన భార్య/భర్తలే చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఒక మహిళ కూడా అదే దారుణానికి ఒడిగట్టింది. పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న ఆమె.. అతనితో కలిసి బతకడం కోసం, అడ్డుగా ఉన్నాడని భర్తని చంపేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Gadwal Love Tragedy: ప్రేమించి మోసం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందంటే?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) పది సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే.. ఏడాది క్రితం ఈశ్మరమ్మకు శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కొన్ని రోజులకే వివాహేతర సంబంధంగా మారింది. కొంతకాలం తుక్కప్పకు తెలియకుండా వీళ్లిద్దరూ రహస్యంగా తమ రాసలీలల్ని కొనసాగించారు. అయితే.. ఒకరోజు తుక్కప్ప వీళ్లిద్దరి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరినీ తుక్కప్ప మందలించాడు. అయినా వారిద్దరి తీరు మారలేదు. తుక్కప్పకు తెలియకుండా రెగ్యులర్గా కలుసుకోవడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల నుంచి తుక్కప్ప పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధినే అడ్డం పెట్టుకొని, భర్తని అంతం చేయాలని ఈశ్వరమ్మ ప్లాన్ వేసింది.
Strange Incident: తల్లి చనిపోయిందనుకొని కర్మకాండ.. రెండేళ్ల తర్వాత యూట్యూబ్లో ప్రత్యక్ష్యం
ప్లాన్లో భాగంగా.. ఇటీవల వైద్యం పేరుతో ఈశ్వరమ్మ తన భర్త తుక్కప్పను ఘట్కేసర్కు తీసుకొచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దామని చెప్పిన ఈశ్వరమ్మ.. మార్గమధ్యంలో మద్యం సేవించే అలవాటున్న తుక్కప్ప కోసం వైన్ షాప్లో మద్యాన్ని కొనుగోలు చేసింది. అదే సమయంలో ప్రియుడు పురుగుల మందు తీసుకొచ్చాడు. ఈ మందుని మద్యంలో కలిపి, తుక్కప్పకు ఇచ్చింది ఈశ్వరమ్మ. అది తాగిన వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. అతడు మృతి చెందాడు. పురుగుల మందు వల్లే అతడు చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలగా.. పోలీసులు ఈశ్వరమ్మ, శ్రీనివాస్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తుక్కప్ప హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెల్చారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!