Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
- హిమాలయాల్లో ఏదో రోజు భారీ భూకంపం..
- టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ..
- దీని ఫలితంగానే భారీ భూకంపాలు..
- నేపాల్, టిబెట్, ఉత్తర భారత రాష్ట్రాలకు ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: మరోసారి హిమాలయాల్లో భూకంపం వచ్చింది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 7.1 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం రావడంతో నేపాల్, ఉత్తర భారత్, టిబెట్ ప్రాంతాలు వణికిపోయాయి. టిబెట్ రాజధాని లాసాకు నైరుతి దిశలో 400 కి.మీ దూరంలోని టింగ్రీ కౌంటీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని సందర్శించే వారికి ఇది పర్యాటక కేంద్రంగా ఉంది. 90కి మందికి పైగా ప్రజలు మరణించారు.
హిమాలయాల్లోనే ఎందుకు భూకంపాలు..?
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా 8 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ముందుకు నెడుతోంది. భూ అంతర్భాగంలో జరిగి ఈ ఘర్షణ ఫలితంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. నిజానికి హిమాలయాలు కూడా కొన్ని కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రక్రియ ద్వారానే ఉద్భవించాయి. ప్రతీ ఏడాది కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోంది. దీని వల్ల హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Read Also: Chinese Manjha: యువకుడి ప్రాణం తీసిన చైనీస్ మాంజా.. గొంతు కోయడంతో మృతి..
ఈ క్రమంలోనే ఏదో రోజు హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని.. అయితే ఇది ఒక రోజు తర్వాత జరగవచ్చు, లేకపోతే ఓ వందేళ్ల తరువాతైన ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1897లో షిల్లాంగ్లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనలతో సహా, గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలిలో, 2015లో నేపాల్లో భూకంపాలు సంభవించాయి.
హిమాలయ దేశం నేపాల్ చాలా తీవ్రమైన భూకంపాలను ఎదుర్కొంటోంది. 2015లో, నేపాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు మరియు 22,000 మందికి పైగా గాయపడ్డారు, అర మిలియన్లకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!