Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
- హిమాలయాల్లో ఏదో రోజు భారీ భూకంపం..
- టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ..
- దీని ఫలితంగానే భారీ భూకంపాలు..
- నేపాల్, టిబెట్, ఉత్తర భారత రాష్ట్రాలకు ముప్పు..
Earthquake: మరోసారి హిమాలయాల్లో భూకంపం వచ్చింది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 7.1 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం రావడంతో నేపాల్, ఉత్తర భారత్, టిబెట్ ప్రాంతాలు వణికిపోయాయి. టిబెట్ రాజధాని లాసాకు నైరుతి దిశలో 400 కి.మీ దూరంలోని టింగ్రీ కౌంటీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని సందర్శించే వారికి ఇది పర్యాటక కేంద్రంగా ఉంది. 90కి మందికి పైగా ప్రజలు మరణించారు.
హిమాలయాల్లోనే ఎందుకు భూకంపాలు..?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా 8 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ముందుకు నెడుతోంది. భూ అంతర్భాగంలో జరిగి ఈ ఘర్షణ ఫలితంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. నిజానికి హిమాలయాలు కూడా కొన్ని కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రక్రియ ద్వారానే ఉద్భవించాయి. ప్రతీ ఏడాది కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోంది. దీని వల్ల హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Read Also: Chinese Manjha: యువకుడి ప్రాణం తీసిన చైనీస్ మాంజా.. గొంతు కోయడంతో మృతి..
ఈ క్రమంలోనే ఏదో రోజు హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని.. అయితే ఇది ఒక రోజు తర్వాత జరగవచ్చు, లేకపోతే ఓ వందేళ్ల తరువాతైన ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1897లో షిల్లాంగ్లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనలతో సహా, గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలిలో, 2015లో నేపాల్లో భూకంపాలు సంభవించాయి.
హిమాలయ దేశం నేపాల్ చాలా తీవ్రమైన భూకంపాలను ఎదుర్కొంటోంది. 2015లో, నేపాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు మరియు 22,000 మందికి పైగా గాయపడ్డారు, అర మిలియన్లకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!