UP: అర్ధరాత్రి ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. కుమార్తె నిద్ర లేవడంతో..!
- యూపీలోని లక్నోలో దారుణం
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన దుర్మార్గురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసుండాల్సిన ఆలుమగల మధ్యలోకి మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితం అతలాకుతలం అయిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని.. ఇంట్లోనే మరణశాసనం రాసింది ఓ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి పతిని తుది ముట్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాకూర్గంజ్లో చోటుచేసుకుంది.
శత్రుఘ్న రాథోడ్ (50), రాఖీ రాథోడ్ భార్యాభర్తలు. శత్రుఘ్న రాథోడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. అయితే శత్రుఘ్న రాథోడ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో రాఖీ రాథోడ్ దారి తప్పింది. ధర్మేంద్ర రాథోడ్ (40) అనే ఓ ట్రావెల్ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటూ ఉండేవారు. ఇలా అక్రమ సంబంధం సాగిపోతుండగా.. ఒకసారి హఠాత్తుగా భర్త శత్రుఘ్న రాథోడ్ కంట్లో పడ్డారు. దీంతో ఇద్దరిని తీవ్రంగా హెచ్చరించాడు. అంతే అప్పటి నుంచి కసితో రగిలిపోయారు. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. అంతే డిసెంబర్ 30, 2024న హత్యకు ప్లాన్ వేశారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
శత్రుఘ్న రాథోడ్ పనులు ముగించుకుని డిసెంబర్ 30న రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక ఓ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తల్లి, నలుగురు కూతుళ్ల మరొక గదిలో నిద్రించారు. అయితే అర్ధరాత్రి 1:30 సమయంలో ధర్మేంద్ర రాథోడ్, అతని సోదరుడు అంకిత్ రాథోడ్, వాళ్ల స్నేహితుడు రంజిత్ విశ్వకర్మ ఇంట్లోకి ప్రవేశించి శత్రుఘ్న రాథోడ్ ప్రాణాలు తీశారు. అయితే డోర్ తీసిన సౌండ్ వినపడడంతో మెలకువుగా ఉన్న పెద్ద కుమార్తె లేచి.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. దీంతో నిందితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ పరిణామంలో 18 అడుగుల టెర్రస్ గోడపై నుంచి కిందకి దూకారు. నిందితుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఓ సీసీకెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే తన భర్తను దుండగులు చంపేశారని రాఖీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాము పడుకున్న డోర్ తలుపు గొళ్లెం ఎవరో బయటపెట్టారని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాఖీ రాథోడ్ను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. ధర్మేంద్ర రాథోడ్తో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. గుండెపోటుతో భర్త చనిపోయినట్లుగా.. సాధారణ మరణంగా చిత్రీకరించాలని నిందితులు చూశారని.. పెద్ద కుమార్తె నిద్ర లేవడంతో మర్డర్ ఫ్లాన్ విఫలమైందని డీసీపీ వెస్ట్ విశ్వజీత్ శ్రీవాస్తవ చెప్పారు. రాఖీ రాథోడ్తో సహా నిందితులు ధర్మేంద్ర రాథోడ్, అంకిత్ రాథోడ్, రంజిత్ విశ్వకర్మలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భర్త భూమ్మీద లేకపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో నలుగురు కుమార్తెలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!