Black magic: యూట్యూబ్లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
- ధనవంతులు కావడానికి నరబలి..
- యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకున్న నిందితులు..
- ఓ వ్యక్తి తల నరికి పుర్రెతో తాంత్రిక పూజలు..
- కేసును ఛేదించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black magic: ఘజియాబాద్లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని హతమార్చి, అతడి పుర్రెతో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఇలా చేస్తే వారు రూ. 50-60 కోట్లు లభిస్తాయనే దురాశతో హత్య చేసినట్లు తేలింది.
బీహార్కి చెందిన నిందితులు ఢిల్లీలో ఈ -రిక్షా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు తాము యూట్యూబ్లో చూసి చేతబడి, ఇతర క్షుద్రపూజలు నేర్చుకున్నామని, మానవ పుర్రెతో పూజలు చేస్తే వెంటనే ధనవంతులం అవుతామని భావించారు. అరెస్టయిన నిందితులను వికాస్ అలియాస్ పరమాత్మ, నరేంద్ర, పనవ్ కుమార్, పంజజ్గా గుర్తించారు.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
Read Also: Eluru Crime: దారుణం.. చిన్నారి మృతదేహాన్ని విసిరేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఈ నేరం జూన్ 2024లో జరిగింది. పోలీసులు ఘజియాబాద్లోని కాలువలో తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో ఇద్దరు నిందితులు వికాస్ గుప్తా(24), ధనంజయ్(25)లను అరెస్ట్ చేశారు. విచారణలో వికాస్ ఒక వ్యక్తిని చంపి, అతడి పుర్రెను తాంత్రిక పూజల్లోఉఫయోగించినట్లు చెప్పారు. పరమాత్మ సూచన మేరకు రాజు షా(29) అనే వ్యక్తిని హత్య చేసినట్లు వికాస్ గుప్తా, ధనుంజయ్ పోలీసులకు చెప్పారు. డిసెంబర్ 07న శనివారం పరమాత్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
పంకజ్, పవన్ కోసం ఒక పుర్రెను సంపాదించాలని తనను నరేంద్ర కోరినట్లు పరమాత్మ వెల్లడించారు. చేతబడి వారిని ధనవంతులుగా చేస్తుందని నమ్మి.. పరమాత్మ రాజుని చంపి అతడి పుర్రెని తెస్తే రూ. 5 లక్షలు ఇస్తానని వికాస్, ధనుంజయ్ని ఆశపెట్టారు. ఆ పుర్రెని నరేంద్రకు ఇవ్వాలని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఘజియాబాద్ డ్రైన్ నుంచి రాజు పుర్రెను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!