Black magic: యూట్యూబ్లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
- ధనవంతులు కావడానికి నరబలి..
- యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకున్న నిందితులు..
- ఓ వ్యక్తి తల నరికి పుర్రెతో తాంత్రిక పూజలు..
- కేసును ఛేదించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black magic: ఘజియాబాద్లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని హతమార్చి, అతడి పుర్రెతో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఇలా చేస్తే వారు రూ. 50-60 కోట్లు లభిస్తాయనే దురాశతో హత్య చేసినట్లు తేలింది.
బీహార్కి చెందిన నిందితులు ఢిల్లీలో ఈ -రిక్షా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు తాము యూట్యూబ్లో చూసి చేతబడి, ఇతర క్షుద్రపూజలు నేర్చుకున్నామని, మానవ పుర్రెతో పూజలు చేస్తే వెంటనే ధనవంతులం అవుతామని భావించారు. అరెస్టయిన నిందితులను వికాస్ అలియాస్ పరమాత్మ, నరేంద్ర, పనవ్ కుమార్, పంజజ్గా గుర్తించారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read Also: Eluru Crime: దారుణం.. చిన్నారి మృతదేహాన్ని విసిరేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఈ నేరం జూన్ 2024లో జరిగింది. పోలీసులు ఘజియాబాద్లోని కాలువలో తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో ఇద్దరు నిందితులు వికాస్ గుప్తా(24), ధనంజయ్(25)లను అరెస్ట్ చేశారు. విచారణలో వికాస్ ఒక వ్యక్తిని చంపి, అతడి పుర్రెను తాంత్రిక పూజల్లోఉఫయోగించినట్లు చెప్పారు. పరమాత్మ సూచన మేరకు రాజు షా(29) అనే వ్యక్తిని హత్య చేసినట్లు వికాస్ గుప్తా, ధనుంజయ్ పోలీసులకు చెప్పారు. డిసెంబర్ 07న శనివారం పరమాత్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
పంకజ్, పవన్ కోసం ఒక పుర్రెను సంపాదించాలని తనను నరేంద్ర కోరినట్లు పరమాత్మ వెల్లడించారు. చేతబడి వారిని ధనవంతులుగా చేస్తుందని నమ్మి.. పరమాత్మ రాజుని చంపి అతడి పుర్రెని తెస్తే రూ. 5 లక్షలు ఇస్తానని వికాస్, ధనుంజయ్ని ఆశపెట్టారు. ఆ పుర్రెని నరేంద్రకు ఇవ్వాలని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఘజియాబాద్ డ్రైన్ నుంచి రాజు పుర్రెను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!