Black magic: యూట్యూబ్లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
- ధనవంతులు కావడానికి నరబలి..
- యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకున్న నిందితులు..
- ఓ వ్యక్తి తల నరికి పుర్రెతో తాంత్రిక పూజలు..
- కేసును ఛేదించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black magic: ఘజియాబాద్లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని హతమార్చి, అతడి పుర్రెతో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఇలా చేస్తే వారు రూ. 50-60 కోట్లు లభిస్తాయనే దురాశతో హత్య చేసినట్లు తేలింది.
బీహార్కి చెందిన నిందితులు ఢిల్లీలో ఈ -రిక్షా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు తాము యూట్యూబ్లో చూసి చేతబడి, ఇతర క్షుద్రపూజలు నేర్చుకున్నామని, మానవ పుర్రెతో పూజలు చేస్తే వెంటనే ధనవంతులం అవుతామని భావించారు. అరెస్టయిన నిందితులను వికాస్ అలియాస్ పరమాత్మ, నరేంద్ర, పనవ్ కుమార్, పంజజ్గా గుర్తించారు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
Read Also: Eluru Crime: దారుణం.. చిన్నారి మృతదేహాన్ని విసిరేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఈ నేరం జూన్ 2024లో జరిగింది. పోలీసులు ఘజియాబాద్లోని కాలువలో తల లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో ఇద్దరు నిందితులు వికాస్ గుప్తా(24), ధనంజయ్(25)లను అరెస్ట్ చేశారు. విచారణలో వికాస్ ఒక వ్యక్తిని చంపి, అతడి పుర్రెను తాంత్రిక పూజల్లోఉఫయోగించినట్లు చెప్పారు. పరమాత్మ సూచన మేరకు రాజు షా(29) అనే వ్యక్తిని హత్య చేసినట్లు వికాస్ గుప్తా, ధనుంజయ్ పోలీసులకు చెప్పారు. డిసెంబర్ 07న శనివారం పరమాత్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
పంకజ్, పవన్ కోసం ఒక పుర్రెను సంపాదించాలని తనను నరేంద్ర కోరినట్లు పరమాత్మ వెల్లడించారు. చేతబడి వారిని ధనవంతులుగా చేస్తుందని నమ్మి.. పరమాత్మ రాజుని చంపి అతడి పుర్రెని తెస్తే రూ. 5 లక్షలు ఇస్తానని వికాస్, ధనుంజయ్ని ఆశపెట్టారు. ఆ పుర్రెని నరేంద్రకు ఇవ్వాలని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఘజియాబాద్ డ్రైన్ నుంచి రాజు పుర్రెను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!