Crime: మద్యం మత్తులో వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
- మద్యం మత్తులో నర్సుపై వైద్యుడి అత్యాచారయత్నం
- ప్రైవేట్ పార్ట్ కోసేసిన నర్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సమస్తిపూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్లోని ఆర్బిఎస్ హెల్త్ కేర్లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట మద్యం సేవించాడని, ఆ తర్వాత నర్సుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నర్సు నిరాకరించింది. తనను తాను ఎలాగైనా కాపాడుకునేందుకు ధైర్యం చేసి సర్జికల్ బ్లేడ్తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్ను కోసేసింది. అనంతరం నర్సు అక్కడి నుంచి పారిపోయింది.
READ MORE: Harish Rao: హరీష్ రావు ఎడమ చేతికి గాయం.. నొప్పితో బాధపడుతూ పీఎస్లోకి (వీడియో)
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ఇద్దరు డాక్టర్ సహోద్యోగులు ఆమెను పట్టుకునేందుకు పరిగెత్తారు. నర్స్ తన ఫోన్ నుంచి వెంటనే డయల్ 112 కి కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్పీ వినయ్ తివారీ ఆదేశాల మేరకు ఓ బృందం దాడులు నిర్వహించి వైద్యుడ్ని, మరో ఇద్దరు సహచరులను కూడా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు డాక్టర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
READ MORE:Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
బాధితురాలు 112కు అర్ధరాత్రి కాల్ చేసిందని సదర్ డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సు గత 10 నుంచి 15 నెలలుగా ఆర్బీఎస్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. పోలీసులు సంఘటన స్థలం నుంచి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలంలో బెడ్ సీటు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరగడానికి ముందు సీసీటీవీ కెమెరా స్విచ్ ఆఫ్ చేయబడింది. అరెస్టయిన నిందితులను డాక్టర్ సంజయ్ కుమార్ సంజుగా గుర్తించారు. రెండో సహచరుడిని వైశాలి జిల్లా బలిగావ్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ గుప్తాగా గుర్తించగా, మూడో వ్యక్తి బాంగ్రాలోని వాజిత్పూర్ సర్సౌనా పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న అవధేష్ కుమార్గా గుర్తించారు.
తాజావార్తలు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!