Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- బుల్డోజర్ న్యాయంపై మరోసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
- నేర ప్రమేయం ఇళ్లు కూల్చివేతకు ఆధారం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme court: ‘‘బుల్డోజర్ న్యాయం’’పై ఈ నెలలో రెండోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణ ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి ఆధారం కాదని, అలాంటి చర్యలు దేశ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. గుజరాత్లోని ఖేడా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్ని విచారించిన న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సుధాన్షు ధులియా, ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత తన కుటుంబానికి చెందిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామని మున్సిపల్ అధికారులు బెదిరించారని అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పారు.
సయీద్ తరుపు న్యాయవాది కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. కాత్లాల్ గ్రామ రెవెన్యూ రికార్డులు, ఇల్లు ఉన్న చోటుకి తన క్లయింట్ సహ యజమాని అని సుప్రీంకోర్టులో చెప్పాడు. అతడి కుటుంబం మూడు తరాలుగా రెండు దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న స్థలంలో 2004 ఆగస్టులో గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించిందని చెప్పారు. సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు ఇల్లు కూల్చేముందు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా న్యాయవాది గుర్తు చేశారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధమైన పాలన ఉన్న దేశంలో.. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి నేరం కుటుంబంలోని ఇతర సభ్యులపై లేదా చట్టబద్ధంగా నిర్మించిన నివాసంపై చర్యలు తీసుకోలేవని పేర్కొంది. నేరంలో ప్రమేయం ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి కారణం కాదు అని బెంచ్ పేర్కొంది. సయీద్పై కేసు మాత్రమే నమోదైందని, దానిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా కోర్టులో రుజువు చేయాలని సూచించింది.
‘‘చట్టం అత్యున్నతమైన దేశంలో అనూహ్యమైన ఇలాంటి కూల్చివేత బెదిరింపులను కోర్టు విస్మరించదు. లేదంటే ఇలాంటి చర్యలు చట్టాలపై బుల్డోజర్లను నడుపుతున్నట్లు చూడవచ్చు’’అని బెంజ్ పేర్కొంది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి నోటీసలు జారీ చేసి నాలుగు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సయీద్ ఇంటిని కూల్చివేయొద్దని ఆదేశించింది.
ఇలా బుల్డోజర్ న్యాయంపై సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కేవలం నిందితుడు లేదా దోషి అయినందున కూల్చివేత ఎలా అవుతుంది… అనధికారికంగా నిర్మాణం జరిగితే జరిమానా. కొంత క్రమబద్ధీకరణ ఉండాలి. మేము ఒక విధానాన్ని రూపొందిస్తాము. మీరు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేస్తామని చెబుతున్నారు, వాటికి మార్గదర్శకాల అవసరం ఉంది, దానిని డాక్యుమెంట్ చేయాలి.” అని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!