Stock Market Trading Scam: స్టాక్ మార్కెట్ పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలు లాగేశారు.. కానిస్టేబుళ్ల కీలక పాత్ర..!
- కావలిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం..
- వివిధ వర్గాల ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Trading Scam: నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివిధ వర్గాల ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా సంస్థ కార్యాలయానికి నిర్వాహకుడు రాకపోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూళ్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది.
Read Also: Maha Kumbh Mela: నో వెహికల్ జోన్గా ఆదేశాలు.. ప్రయాగ్రాజ్ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ పేరుతో గుంటూరుకు చెందిన మహమ్మద్ సుభానీ.. స్టాక్ మార్కెట్ కార్యాలయాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇందులో స్థానికంగా ఉన్న 17 మందిని డైరెక్టర్లుగా చేర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన లాభంలో వారి స్థాయిని బట్టి.. పర్సంటేజ్ ని నిర్ణయించాడు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై అవగాహన కల్పిస్తామని ప్రకటనలు ఇచ్చి పలువురు యువతీ.. యువకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణలో భాగంగా వారిలో ఒకొకరి నుంచి పదివేల రూపాయలను పెట్టుబడిగా పెడతానని వసూలు చేసి.. నెల రోజుల్లోనే 13 వేలు ఇచ్చారు. దీంతో నమ్మకం కుదరడంతో శిక్షణకు వచ్చిన పలువురు తమ బంధుమిత్రుల ద్వారా కూడా డబ్బులు కట్టించారు. అంతేగాక కావలి పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని వివిధ వర్గాల ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.. లక్ష రూపాయలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకూ ప్రతిఫలాన్ని అందించారు.
Read Also: AP Government: మాదక ద్రవ్యాలపై యుద్ధం.. విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు..
ఇక, పెట్టిన డబ్బుకు అధికంగా ఆదాయం వస్తుండడంతో కొందరు ఉద్యోగులు.. వ్యాపారులు. పోలీసులు.. డబ్బులు కట్టారు. కావలికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఏజెంట్లుగా వ్యవహరించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా చాలా వర్గాల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ నగదును సమీకరించారు. గత కొద్ది రోజులుగా కార్యాలయానికి నిర్వహకుడు సుభానీ రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుభానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు.. పూణే… మక్తల్… కాకినాడలలో కూడా ఇదే తరహా లో డబ్బులను సుభానీ వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం కార్యాలయానికి తాళం వేయడంతో
డబ్బులు చెల్లించిన వారు ఆందోళన చెందుతున్నారు. తాము కష్టపడి చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని కలత చెందుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పై విచారణ చేస్తున్నామని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!