Maha Kumbh Mela: నో వెహికల్ జోన్గా ఆదేశాలు.. ప్రయాగ్రాజ్ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
- ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించిన యూపీ ప్రభుత్వం
- వాహనాలు లేకుండా ఖాళీ చేయిస్తున్న పోలీసులు
- బుధవారం మాఘి పూర్ణిమ స్నానానికి భారీగా భక్తులు వస్తారని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రయాగ్రాజ్లో మాఘి పూర్ణిమ స్నానం జరగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మూడు రోజుల నుంచి ప్రయాగ్రాజ్లో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. దాదాపు 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ముందుకు.. వెనక్కి పోయే పరిస్థితులు లేవు. దీంతో బుధవారం భక్తులు మరింత పెరిగితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించి యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్రాజ్ పరిసరాలను నో వెహికల్ జోన్గా ప్రకటించింది. ఫిబ్రవరి 11, ఉదయం 4 గంటల నుంచి వాహనాలను ఖాళీ చేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిగా వాహనాలు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వెహికల్స్ లేకుండా చేయాలనే ఉద్దేశం కఠిన ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వాహనాలను తరలించే కార్యక్రమానికి పోలీసులు చేపట్టారు. భక్తులు సాఫీగా పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: మరో ఘోరం.. బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్లోని జబల్పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Liquor Prices: అమల్లోకి కొత్త మద్యం ధరలు.. వాటికి మాత్రమే మినహాయింపు..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!