Crime News: వీడు కొడుకా కసాయా.. తండ్రి హత్యకు సుపారీ.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Gives One Crore To Kill His Father In Karnataka: మానవ సంబంధాలు రానురాను మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం.. సొంత మనుషుల్నే కడతేరుస్తున్నారు. అడ్డు తొలగించుకుంటే, ఆస్తంతా తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో.. తామే చంపడమో, సుపారీ ఇచ్చి చంపించడమో చేస్తున్నారు. ఇప్పుడో కసాయి కూడా అలాంటి దారుణానికే పాల్పడ్డాడు. ఆస్తి కోసం.. కన్న తండ్రి హత్యకు రూ.1 కోటి సుపారీ ఇచ్చాడు. చివరికి అడ్డంగా బుక్కై.. కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్కి ఝలక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న కృష్ణరాజపురంలో నారాయణస్వామి (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఆయనకు మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి విషయమై మణికంఠ తన తండ్రితో ఎప్పుడూ గొడవలు పడుతుండేవాడు. తన పేరిట ఆస్తి మొత్తం రాయాల్సిందేనని డిమాండ్ చేస్తుండేవాడు. కానీ, తండ్రి అందుకు అంగీకరించేవాడు కాదు. దీంతో.. తండ్రి అడ్డు తొలగిస్తే, ఆస్తంతా తనకే సొంతం అవుతుందని భావించి, తండ్రిని చంపాలని అనుకున్నాడు. తాను నేరుగా చేస్తే ఆ నేరం తన మీదకు వస్తుందని, అలా కాకుండా కిరాయి హంతకులతో ప్లాన్ చేసి చంపిస్తే, తాను తప్పించుకోవచ్చని భావించాడు. తనకు తెలిసిన వ్యక్తుల సహకారంతో కిరాయి హంతకుల గురించి తెలుసుకున్న మణికంత.. తన తండ్రి హత్యకు వారితో రూ.1 కోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన ప్రమేయం ఉన్న సంగతి బయటపడకుండా.. పక్కా ప్లాన్తో హత్య చేయాలని సూచించాడు.
MLC Jeevan Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు.. జీవన్రెడ్డి హెచ్చరిక
సుపారీ అందుకున్న కిరాయి హంతకులు.. నారాయణ స్వామిని మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ స్థలంలో నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత సుపారీ హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా.. మణికంఠే సుపారీ ఇచ్చి, తన తండ్రి హత్య చేయించాడని వాళ్లు తెలిపారు. దీంతో.. అతడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా.. తాను తన తండ్రి హత్య చేయించానని మణికంఠ నేరం ఒప్పుకున్నాడు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..