Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Reveals BJP Goal In Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలపై బీజేపీ పోరాడుతోందన్నారు. కార్నర్ స్ట్రీట్ మీటింగ్లు విజయవంతం అయ్యాయని, ఈ విషయంలో బీజేపీ సెంట్రల్ టీమ్ సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగింది రొటీన్ సమావేశమని, 15 రోజుల క్రితమే ఈ సమావేశానికి ప్లాన్ చేశారని అన్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామని, 10 జిల్లాల్లో పెద్ద సమావేశాలు పెడతామని, ఆ తర్వాత మోడీతో భారీ సభ ఉంటుందని తెలియజేశారు.
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్గా భారీ విగ్రహం
Also Read
- Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపిన బండి సంజయ్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చినా.. కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్.. కవితపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలనుకునే నాయకులకు బండి సంజయ్ నాయకులకు స్వాగతం పలికారు.
Joginipalli Santosh Kumar: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు ముక్తి కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని, కేసీఆరర్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇక ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చ జరిగిందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!