Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Reveals BJP Goal In Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలపై బీజేపీ పోరాడుతోందన్నారు. కార్నర్ స్ట్రీట్ మీటింగ్లు విజయవంతం అయ్యాయని, ఈ విషయంలో బీజేపీ సెంట్రల్ టీమ్ సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగింది రొటీన్ సమావేశమని, 15 రోజుల క్రితమే ఈ సమావేశానికి ప్లాన్ చేశారని అన్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామని, 10 జిల్లాల్లో పెద్ద సమావేశాలు పెడతామని, ఆ తర్వాత మోడీతో భారీ సభ ఉంటుందని తెలియజేశారు.
Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్గా భారీ విగ్రహం
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపిన బండి సంజయ్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చినా.. కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్.. కవితపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలనుకునే నాయకులకు బండి సంజయ్ నాయకులకు స్వాగతం పలికారు.
Joginipalli Santosh Kumar: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు ముక్తి కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని, కేసీఆరర్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇక ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చ జరిగిందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Movie Update : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!