Crime News: వీడు కొడుకా కసాయా.. తండ్రి హత్యకు సుపారీ.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Gives One Crore To Kill His Father In Karnataka: మానవ సంబంధాలు రానురాను మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం.. సొంత మనుషుల్నే కడతేరుస్తున్నారు. అడ్డు తొలగించుకుంటే, ఆస్తంతా తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో.. తామే చంపడమో, సుపారీ ఇచ్చి చంపించడమో చేస్తున్నారు. ఇప్పుడో కసాయి కూడా అలాంటి దారుణానికే పాల్పడ్డాడు. ఆస్తి కోసం.. కన్న తండ్రి హత్యకు రూ.1 కోటి సుపారీ ఇచ్చాడు. చివరికి అడ్డంగా బుక్కై.. కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్కి ఝలక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్
Also Read
- Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న కృష్ణరాజపురంలో నారాయణస్వామి (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఆయనకు మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి విషయమై మణికంఠ తన తండ్రితో ఎప్పుడూ గొడవలు పడుతుండేవాడు. తన పేరిట ఆస్తి మొత్తం రాయాల్సిందేనని డిమాండ్ చేస్తుండేవాడు. కానీ, తండ్రి అందుకు అంగీకరించేవాడు కాదు. దీంతో.. తండ్రి అడ్డు తొలగిస్తే, ఆస్తంతా తనకే సొంతం అవుతుందని భావించి, తండ్రిని చంపాలని అనుకున్నాడు. తాను నేరుగా చేస్తే ఆ నేరం తన మీదకు వస్తుందని, అలా కాకుండా కిరాయి హంతకులతో ప్లాన్ చేసి చంపిస్తే, తాను తప్పించుకోవచ్చని భావించాడు. తనకు తెలిసిన వ్యక్తుల సహకారంతో కిరాయి హంతకుల గురించి తెలుసుకున్న మణికంత.. తన తండ్రి హత్యకు వారితో రూ.1 కోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన ప్రమేయం ఉన్న సంగతి బయటపడకుండా.. పక్కా ప్లాన్తో హత్య చేయాలని సూచించాడు.
MLC Jeevan Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు.. జీవన్రెడ్డి హెచ్చరిక
సుపారీ అందుకున్న కిరాయి హంతకులు.. నారాయణ స్వామిని మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ స్థలంలో నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత సుపారీ హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా.. మణికంఠే సుపారీ ఇచ్చి, తన తండ్రి హత్య చేయించాడని వాళ్లు తెలిపారు. దీంతో.. అతడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా.. తాను తన తండ్రి హత్య చేయించానని మణికంఠ నేరం ఒప్పుకున్నాడు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!