Crime News: వీడు కొడుకా కసాయా.. తండ్రి హత్యకు సుపారీ.. ఎందుకో తెలుసా?
Son Gives One Crore To Kill His Father In Karnataka: మానవ సంబంధాలు రానురాను మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం.. సొంత మనుషుల్నే కడతేరుస్తున్నారు. అడ్డు తొలగించుకుంటే, ఆస్తంతా తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో.. తామే చంపడమో, సుపారీ ఇచ్చి చంపించడమో చేస్తున్నారు. ఇప్పుడో కసాయి కూడా అలాంటి దారుణానికే పాల్పడ్డాడు. ఆస్తి కోసం.. కన్న తండ్రి హత్యకు రూ.1 కోటి సుపారీ ఇచ్చాడు. చివరికి అడ్డంగా బుక్కై.. కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్కి ఝలక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న కృష్ణరాజపురంలో నారాయణస్వామి (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఆయనకు మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి విషయమై మణికంఠ తన తండ్రితో ఎప్పుడూ గొడవలు పడుతుండేవాడు. తన పేరిట ఆస్తి మొత్తం రాయాల్సిందేనని డిమాండ్ చేస్తుండేవాడు. కానీ, తండ్రి అందుకు అంగీకరించేవాడు కాదు. దీంతో.. తండ్రి అడ్డు తొలగిస్తే, ఆస్తంతా తనకే సొంతం అవుతుందని భావించి, తండ్రిని చంపాలని అనుకున్నాడు. తాను నేరుగా చేస్తే ఆ నేరం తన మీదకు వస్తుందని, అలా కాకుండా కిరాయి హంతకులతో ప్లాన్ చేసి చంపిస్తే, తాను తప్పించుకోవచ్చని భావించాడు. తనకు తెలిసిన వ్యక్తుల సహకారంతో కిరాయి హంతకుల గురించి తెలుసుకున్న మణికంత.. తన తండ్రి హత్యకు వారితో రూ.1 కోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన ప్రమేయం ఉన్న సంగతి బయటపడకుండా.. పక్కా ప్లాన్తో హత్య చేయాలని సూచించాడు.
MLC Jeevan Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు.. జీవన్రెడ్డి హెచ్చరిక
సుపారీ అందుకున్న కిరాయి హంతకులు.. నారాయణ స్వామిని మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ స్థలంలో నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత సుపారీ హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా.. మణికంఠే సుపారీ ఇచ్చి, తన తండ్రి హత్య చేయించాడని వాళ్లు తెలిపారు. దీంతో.. అతడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా.. తాను తన తండ్రి హత్య చేయించానని మణికంఠ నేరం ఒప్పుకున్నాడు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!