Realtor Murder Case: రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
- రియల్టర్ గంగాధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి సంచలన అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realtor Murder Case: రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. మృతుడు గంగాధర్ వడ్డీల పేరుతో మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించడంతోనే హత్య గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈనెల 15న జరిగిన రియల్ ఎస్టేట్ గంగాధర్ హత్య కేసులో భార్య వనితతోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు… అదుపులోకి తీసుకు వీరిలో భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గంగాధర్ హత్య కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మృతుడు గంగాధర్ గత కొంతకాలంగా కొంత మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచ్చి వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలను వారికి తెలియకుండా తన సెల్ ఫోన్ లో తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారిని వేధించేవాడని అన్నారు. భార్య వనితను సైతం శారీరకంగా, మానసికంగా హింసించేవాడన్నారు. భర్త గంగాధర్ పై కక్ష్య పెంచుకున్న భార్య వనిత మరో ఇద్దరుతో కలసి ఈనెల 15న గంగాధర్ కు తన ఇంట్లోనే నిద్ర మాత్రలు ఇచ్చి గంగాధర్ నిద్రిస్తున్న సమయంలో అతని తల పై బండరాయితో మోదీ హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు… ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!