Realtor Murder Case: రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
- రియల్టర్ గంగాధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి సంచలన అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realtor Murder Case: రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. మృతుడు గంగాధర్ వడ్డీల పేరుతో మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించడంతోనే హత్య గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈనెల 15న జరిగిన రియల్ ఎస్టేట్ గంగాధర్ హత్య కేసులో భార్య వనితతోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు… అదుపులోకి తీసుకు వీరిలో భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గంగాధర్ హత్య కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మృతుడు గంగాధర్ గత కొంతకాలంగా కొంత మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచ్చి వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలను వారికి తెలియకుండా తన సెల్ ఫోన్ లో తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారిని వేధించేవాడని అన్నారు. భార్య వనితను సైతం శారీరకంగా, మానసికంగా హింసించేవాడన్నారు. భర్త గంగాధర్ పై కక్ష్య పెంచుకున్న భార్య వనిత మరో ఇద్దరుతో కలసి ఈనెల 15న గంగాధర్ కు తన ఇంట్లోనే నిద్ర మాత్రలు ఇచ్చి గంగాధర్ నిద్రిస్తున్న సమయంలో అతని తల పై బండరాయితో మోదీ హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు… ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!