Realtor Murder Case: రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
- రియల్టర్ గంగాధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి సంచలన అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realtor Murder Case: రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. మృతుడు గంగాధర్ వడ్డీల పేరుతో మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించడంతోనే హత్య గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈనెల 15న జరిగిన రియల్ ఎస్టేట్ గంగాధర్ హత్య కేసులో భార్య వనితతోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు… అదుపులోకి తీసుకు వీరిలో భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గంగాధర్ హత్య కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మృతుడు గంగాధర్ గత కొంతకాలంగా కొంత మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచ్చి వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలను వారికి తెలియకుండా తన సెల్ ఫోన్ లో తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారిని వేధించేవాడని అన్నారు. భార్య వనితను సైతం శారీరకంగా, మానసికంగా హింసించేవాడన్నారు. భర్త గంగాధర్ పై కక్ష్య పెంచుకున్న భార్య వనిత మరో ఇద్దరుతో కలసి ఈనెల 15న గంగాధర్ కు తన ఇంట్లోనే నిద్ర మాత్రలు ఇచ్చి గంగాధర్ నిద్రిస్తున్న సమయంలో అతని తల పై బండరాయితో మోదీ హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు… ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?