TDP Activist Murder Case: టీడీపీ నేత హత్య కేసులో నిందితుల అరెస్ట్..
- చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య..
- చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురంలో ఈ నెల 15న ఘటన..
- రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన రామకృష్ణ హత్య..
- నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Activist Murder Case: రాజకీయ కారణాలతో జరిగిన రామకృష్ణ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈనెల 15వ తేదీన దారుణ హత్య గురయ్యాడు..
Read Also: PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ప్రధాన నిందితుడు వెంకటరమణ అతని సహచరులు రామకృష్ణ కుమారుడు సురేష్ పై వేట కొడవిలితో దాడి చేయగా.. కొడుకును రక్షించేందుకు రామకృష్ణ ప్రయత్నించగా.. ప్రత్యర్ధులు రామకృష్ణను మెడపై నరికారు.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రామకృష్ణ హత్య రాజకీయ పోరులో ఒక భాగమని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రెడ్డప్ప రెడ్డి.. రామకృష్ణ హత్య కేసులో దాడికి మూలకర్తగా వ్యవహరించారని.. అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. రామకృష్ణ హత్య కేసులో ఉన్న నిందితులు పలు భూ అక్రమణాలకు పాల్పడినట్టు.. పలువురిని బెదిరించిన ఘటనల్లో పాల్గొన్నట్లు ఆధారాలను సేకవించారు పోలీసులు. హత్య కేసులో ముద్దాయిలు అక్కిసాని భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి , సంగారెడ్డి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తేల్చారు. హత్య కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలను ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని.. ఈ కేసులో సాక్షుల రక్షణకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు..
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!