Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా 40 మంది ముఠా ఆట కట్టించిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే ఈ ముఠా టార్గెట్. ఇందుకోసం ఖరీదైన కార్లను వాడుతున్నారు. అంతే కాదు ఆవులను కారులోకి ఎక్కించేందుకు వీలుగా వాటిలో డ్రైవర్ సీట్ మినహా మిగతా సీట్లన్నీ తీసివేశారు. ఇందుకోసం నాందేడ్లో పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు.
Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా!
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
అర్ధరాత్రి రోడ్లపై పశువుల కోసం తిరిగే ఈ ముఠా సభ్యులు. ఆవులు, ఎద్దులు కనిపించగానే వాటి వద్దకు వెళ్తారు. మెల్లగా వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఆవులు కాస్త మత్తులోకి జారుకోగానే వాటిని అమాంతం కార్లలో ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ఉడాయిస్తారు. అలా తీసుకు వెళ్లిన ఆవులను మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఐతే వీరు ఆవులను దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వీరి ఆట కట్టించారు. ఈ కేసులో తొలుత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద సమాచారం సేకరించి మరో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
POCSO: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నల్లగొండ కోర్టు సంచలన తీర్పు..
రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా వద్ద ఈ ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైంసాకు చెందిన షేక్ ఉమెర్ ఈ ముఠాకి సహకరించాడు. అతనిని, ఖులీద్ను బైంసాలోనే అరెస్టు చేయగా నాందేడ్కు చెందిన రాజు, బైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రెండు వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు, 4 లక్షల 39 వేల 280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. పశువులు, గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.