Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా 40 మంది ముఠా ఆట కట్టించిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే ఈ ముఠా టార్గెట్. ఇందుకోసం ఖరీదైన కార్లను వాడుతున్నారు. అంతే కాదు ఆవులను కారులోకి ఎక్కించేందుకు వీలుగా వాటిలో డ్రైవర్ సీట్ మినహా మిగతా సీట్లన్నీ తీసివేశారు. ఇందుకోసం నాందేడ్లో పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు.
Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా!
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
అర్ధరాత్రి రోడ్లపై పశువుల కోసం తిరిగే ఈ ముఠా సభ్యులు. ఆవులు, ఎద్దులు కనిపించగానే వాటి వద్దకు వెళ్తారు. మెల్లగా వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఆవులు కాస్త మత్తులోకి జారుకోగానే వాటిని అమాంతం కార్లలో ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ఉడాయిస్తారు. అలా తీసుకు వెళ్లిన ఆవులను మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఐతే వీరు ఆవులను దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వీరి ఆట కట్టించారు. ఈ కేసులో తొలుత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద సమాచారం సేకరించి మరో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
POCSO: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నల్లగొండ కోర్టు సంచలన తీర్పు..
రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా వద్ద ఈ ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైంసాకు చెందిన షేక్ ఉమెర్ ఈ ముఠాకి సహకరించాడు. అతనిని, ఖులీద్ను బైంసాలోనే అరెస్టు చేయగా నాందేడ్కు చెందిన రాజు, బైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రెండు వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు, 4 లక్షల 39 వేల 280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. పశువులు, గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!