Crime: దారుణం.. తన ఇద్దరు పిల్లల్ని చంపి మూడేళ్లు ఫ్రిజ్లో ఉంచిన తల్లి కథ..
- అమెరికాలో దారుణ ఘటన
- తన ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
- మూడేళ్ల పాటు ఫ్రిజ్లో ఉంచిన మహిళ
- ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది ఒక మహిళ జీవితానికి సంబంధించిన కథ. ఇది చాలా క్రూరమైన, విషాదకరమైన సంఘటనకు సంబంధించినది. ఇది తల్లి ప్రేమ, ఒక మహిళకి చెందిన భయానకపు కథ ఇది. నిజానికి ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో జరిగింది. ఇక్కడ మిచెల్ బ్లెయిర్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసింది. ఈ హత్య ఘటన ఎంత బాధాకరమో అంతే దారుణం. మిచెల్ తన పిల్లలిద్దరి మృతదేహాలను డీప్ ఫ్రీజర్లో ఉంచి, మూడేళ్ల పాటు ఒకే ఇంట్లో వారితో కలిసి జీవించింది. దీని వెనుక కారణం చాలా షాకింగ్ ఘటన ఉంది.
జీవించేందుకు ఒంటరి మహిళ తంటాలు..
మిచెల్ బ్లెయిర్కు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్తతో సంబంధాలు సరిగా లేకపోవడంతో విడిపోయి పిల్లలతో కలిసి జీవించడం ప్రారంభించింది. మొదట్లో మిచెల్ తన ఖర్చుల కోసం పని చేసేది. కానీ ఆమె ఉద్యోగం కోల్పోవడంతో.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు చేసి కొంత కాలం జీవనం సాగించింది. వాళ్లు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోయింది. పిల్లల పేరును బడిలోంచి తొలగించాలనుకుంది. వాళ్లు ఇంట్లోనే చదువుతానంటూ స్కూల్ టీచర్లకు చెప్పి సాకుగా చూపింది. నిజానికి తన పిల్లలను చదివించలేనని ఆమెకు తెలుసు.
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
విస్తుపోయిన అధికారులు..
ఇదిలా ఉండగా ఆమె ఇంటి అద్దె చాలా నెలలుగా చెల్లించలేదు. మిచెల్ ఇంటిని ఖాళీ చేయకపోవడంతో.. ఇంటి యజమాని ఫిర్యాదుపై ఇల్లు ఖాళీ చేయమని కోర్టు నోటీసు పంపింది. మార్చి 24, 2015న, కోర్టు పంపిన బృందం మిచెల్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో మిషెల్ ఇంట్లో లేకపోవడంతో తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులను బయటకు తీయడం మొదలుపెట్టారు. ఇంతలో బృందం గదిలో ఫ్రీజర్ను ఎత్తడానికి ప్రయత్నించారు. అది బరువుగా కనిపించింది. దీంతో వాళ్లు ఫ్రీజర్ను తెరిచి చూడగా లోపల మందపాటి ఐస్ పొర, పాలిథిన్ బ్యాగ్ కనిపించాయి. బ్యాగ్ని తెరిచి చూడగా, దాన్ని చూసిన టీమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బ్యాగులో బాలిక, అబ్బాయి మృతదేహాలు ..
బ్యాగ్లో బాలిక మృతదేహం ఉంది. దీని తరువాత, ఫ్రీజర్లో మరింత వెతకగా, ఒక బాలుడి మృతదేహం కూడా కనుగొనబడింది. దీంతో వెంటనే పోలీసులను పిలిపించి విచారణ ప్రారంభించారు. ఆమెను అరెస్టు చేసినప్పుడు మిచెల్ తన మిగిలిన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంది. మృతదేహాల గురించి పోలీసులు ఆమెను అడిగారు. కానీ ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్ట్ 2012లో ఓ రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. తన చిన్న కొడుకు, కుమార్తెతో గొడవ పడినట్లు మిచెల్ చెప్పింది. మిచెల్ తన కొడుకును ఏదో తప్పు చేసినట్లు గుర్తించిందని అందుకే తనకు కోపం వచ్చిందని తెలిపింది.
ప్రైవేట్ భాగాలపై వేడినీరు ..
ఆమె నేరుగా తన కుమారుడు స్టీఫెన్ వద్దకు వెళ్లి ఈ చర్య గురించి అడిగింది. దీనిపై పెద్ద కొడుకు అన్నీ ఒప్పుకున్నాడు. దీంతో మిచెల్ తన పెద్ద కొడుకును కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించింది. చాలా రోజుల పాటు కొట్టి హింసించింది. బాలుడి ముఖాన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పి, అతని ప్రైవేట్ భాగాలపై వేడినీరు పోసి చివరకు బ్లేడ్ గొంతు కోసింది. దీంతో బాలుడు 30 ఆగస్టు 2012న మరణించాడు.
మొదట కొడుకు తర్వాత కూతురు
తన పెద్ద కొడుకు మృతదేహాన్ని మిచెల్ దానిని డీప్ ఫ్రీజర్లో ఉంచింది. ఎవరికీ ఏమీ చెప్పవద్దని తన మిగిలిన పిల్లలను బెదిరించింది. స్టీఫెన్ హత్య జరిగిన తొమ్మిది నెలల తర్వాత మే 2013లో తన కుమార్తె మాథ్యూను కూడా హత్య చేసినట్లు మిచెల్ ఒప్పుకుంది. కుమారుడిపై చేసిన క్రూరత్వమే కూతురిపై కూడా చేసింది. బాలికను ఆకలితో ఉంచి.. కొట్టి.. చివరకు చంపేసింది. ఆ సమయంలో కుమార్తె వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే.
పశ్చాత్తాపం లేదు..
మిచెల్ తన కుమార్తె మృతదేహాన్ని కూడా డీప్ ఫ్రీజర్లో ఉంచింది. దీని తరువాత, ఆమె తన పిల్లలిద్దరి మృతదేహాలతో ఒకే ఇంట్లో నివసించింది. మూడేళ్లపాటు అలాగే ఉంది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, మిచెల్ తన చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తన పిల్లలను చంపినందుకు పశ్చాత్తాపం లేదని, ఎందుకంటే వారు చేసిన పని క్షమించరానిదని ఆమె చెప్పింది.
పెరోల్ లేకుండా జీవిత ఖైదు
తమ్ముడితో తన పిల్లలు అనుచితంగా ప్రవర్తించారని, అందుకే వారిని శిక్షించానని మిచెల్ తెలిపింది. అయితే.. ఈ ఆరోపణను ధృవీకరించే ఆధారాలు దర్యాప్తులో కనుగొనబడలేదు. 2015లో, మిచెల్ బ్లెయిర్ తన పిల్లలిద్దరినీ హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఆమెకి ఎప్పటికీ పెరోల్ రాదని కూడా కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!