Crime: దారుణం.. తన ఇద్దరు పిల్లల్ని చంపి మూడేళ్లు ఫ్రిజ్లో ఉంచిన తల్లి కథ..
- అమెరికాలో దారుణ ఘటన
- తన ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
- మూడేళ్ల పాటు ఫ్రిజ్లో ఉంచిన మహిళ
- ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది ఒక మహిళ జీవితానికి సంబంధించిన కథ. ఇది చాలా క్రూరమైన, విషాదకరమైన సంఘటనకు సంబంధించినది. ఇది తల్లి ప్రేమ, ఒక మహిళకి చెందిన భయానకపు కథ ఇది. నిజానికి ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో జరిగింది. ఇక్కడ మిచెల్ బ్లెయిర్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసింది. ఈ హత్య ఘటన ఎంత బాధాకరమో అంతే దారుణం. మిచెల్ తన పిల్లలిద్దరి మృతదేహాలను డీప్ ఫ్రీజర్లో ఉంచి, మూడేళ్ల పాటు ఒకే ఇంట్లో వారితో కలిసి జీవించింది. దీని వెనుక కారణం చాలా షాకింగ్ ఘటన ఉంది.
జీవించేందుకు ఒంటరి మహిళ తంటాలు..
మిచెల్ బ్లెయిర్కు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్తతో సంబంధాలు సరిగా లేకపోవడంతో విడిపోయి పిల్లలతో కలిసి జీవించడం ప్రారంభించింది. మొదట్లో మిచెల్ తన ఖర్చుల కోసం పని చేసేది. కానీ ఆమె ఉద్యోగం కోల్పోవడంతో.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు చేసి కొంత కాలం జీవనం సాగించింది. వాళ్లు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోయింది. పిల్లల పేరును బడిలోంచి తొలగించాలనుకుంది. వాళ్లు ఇంట్లోనే చదువుతానంటూ స్కూల్ టీచర్లకు చెప్పి సాకుగా చూపింది. నిజానికి తన పిల్లలను చదివించలేనని ఆమెకు తెలుసు.
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
విస్తుపోయిన అధికారులు..
ఇదిలా ఉండగా ఆమె ఇంటి అద్దె చాలా నెలలుగా చెల్లించలేదు. మిచెల్ ఇంటిని ఖాళీ చేయకపోవడంతో.. ఇంటి యజమాని ఫిర్యాదుపై ఇల్లు ఖాళీ చేయమని కోర్టు నోటీసు పంపింది. మార్చి 24, 2015న, కోర్టు పంపిన బృందం మిచెల్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో మిషెల్ ఇంట్లో లేకపోవడంతో తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులను బయటకు తీయడం మొదలుపెట్టారు. ఇంతలో బృందం గదిలో ఫ్రీజర్ను ఎత్తడానికి ప్రయత్నించారు. అది బరువుగా కనిపించింది. దీంతో వాళ్లు ఫ్రీజర్ను తెరిచి చూడగా లోపల మందపాటి ఐస్ పొర, పాలిథిన్ బ్యాగ్ కనిపించాయి. బ్యాగ్ని తెరిచి చూడగా, దాన్ని చూసిన టీమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బ్యాగులో బాలిక, అబ్బాయి మృతదేహాలు ..
బ్యాగ్లో బాలిక మృతదేహం ఉంది. దీని తరువాత, ఫ్రీజర్లో మరింత వెతకగా, ఒక బాలుడి మృతదేహం కూడా కనుగొనబడింది. దీంతో వెంటనే పోలీసులను పిలిపించి విచారణ ప్రారంభించారు. ఆమెను అరెస్టు చేసినప్పుడు మిచెల్ తన మిగిలిన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంది. మృతదేహాల గురించి పోలీసులు ఆమెను అడిగారు. కానీ ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్ట్ 2012లో ఓ రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. తన చిన్న కొడుకు, కుమార్తెతో గొడవ పడినట్లు మిచెల్ చెప్పింది. మిచెల్ తన కొడుకును ఏదో తప్పు చేసినట్లు గుర్తించిందని అందుకే తనకు కోపం వచ్చిందని తెలిపింది.
ప్రైవేట్ భాగాలపై వేడినీరు ..
ఆమె నేరుగా తన కుమారుడు స్టీఫెన్ వద్దకు వెళ్లి ఈ చర్య గురించి అడిగింది. దీనిపై పెద్ద కొడుకు అన్నీ ఒప్పుకున్నాడు. దీంతో మిచెల్ తన పెద్ద కొడుకును కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించింది. చాలా రోజుల పాటు కొట్టి హింసించింది. బాలుడి ముఖాన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పి, అతని ప్రైవేట్ భాగాలపై వేడినీరు పోసి చివరకు బ్లేడ్ గొంతు కోసింది. దీంతో బాలుడు 30 ఆగస్టు 2012న మరణించాడు.
మొదట కొడుకు తర్వాత కూతురు
తన పెద్ద కొడుకు మృతదేహాన్ని మిచెల్ దానిని డీప్ ఫ్రీజర్లో ఉంచింది. ఎవరికీ ఏమీ చెప్పవద్దని తన మిగిలిన పిల్లలను బెదిరించింది. స్టీఫెన్ హత్య జరిగిన తొమ్మిది నెలల తర్వాత మే 2013లో తన కుమార్తె మాథ్యూను కూడా హత్య చేసినట్లు మిచెల్ ఒప్పుకుంది. కుమారుడిపై చేసిన క్రూరత్వమే కూతురిపై కూడా చేసింది. బాలికను ఆకలితో ఉంచి.. కొట్టి.. చివరకు చంపేసింది. ఆ సమయంలో కుమార్తె వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే.
పశ్చాత్తాపం లేదు..
మిచెల్ తన కుమార్తె మృతదేహాన్ని కూడా డీప్ ఫ్రీజర్లో ఉంచింది. దీని తరువాత, ఆమె తన పిల్లలిద్దరి మృతదేహాలతో ఒకే ఇంట్లో నివసించింది. మూడేళ్లపాటు అలాగే ఉంది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, మిచెల్ తన చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తన పిల్లలను చంపినందుకు పశ్చాత్తాపం లేదని, ఎందుకంటే వారు చేసిన పని క్షమించరానిదని ఆమె చెప్పింది.
పెరోల్ లేకుండా జీవిత ఖైదు
తమ్ముడితో తన పిల్లలు అనుచితంగా ప్రవర్తించారని, అందుకే వారిని శిక్షించానని మిచెల్ తెలిపింది. అయితే.. ఈ ఆరోపణను ధృవీకరించే ఆధారాలు దర్యాప్తులో కనుగొనబడలేదు. 2015లో, మిచెల్ బ్లెయిర్ తన పిల్లలిద్దరినీ హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఆమెకి ఎప్పటికీ పెరోల్ రాదని కూడా కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!