Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
- స్వాతిని హత్య చేసి 20 ముక్కలు చేసిన నిందితుడు..
- పంట పొలాల్లో దాచిపెట్టిన నిందితు..
- దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త ట్రిస్ట్..
Terrible Inciden: సింగరేణిలో ఉద్యోగం అంటే ఆ దంపతులు నమ్మారు. ఉద్యోగం వస్తే హ్యాపీగా బతికేయొచ్చు అనుకున్నారు. వడ్డీకి లక్షల్లో డబ్బు తీసుకుని మరో మహిళలకు, ఓ వ్యక్తికి ఇచ్చారు. అంతే అటు ఉద్యోగం రాక, ఇటు డబ్బులు లేక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చిన మరో వ్యక్తి, మహిళకు మధ్య డబ్బుల వ్యవహారంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో విసుగు చెందిన వ్యక్తి మహిళను కిరాతకంగా హతమార్చాడు. చివరకు ఆమెను 20 ముక్కలు చేసి ఓ మూట పడేసి పంట పొలాల్లో పడేశాడు. మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పోలీసులే షాకింగ్ గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో సంచలనంగా మారింది.
Read also: KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
అసలు ఏం జరిగిందంటే..
జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతుల వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన కొమ్ముగూడెంకు చెందిన వీరభద్రం, స్వాతి ఇద్దరు కలిసి 16 లక్షలు తీసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ పెరుగుతూ వచ్చింది. దీంతో రత్నకుమార్, పార్వతి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్వాతి, మృతి చెందిన రత్నకుమార్ కుటుంబానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈనేపథ్యంలో స్వాతి, ప్రియుడు వీరభద్రం మధ్య విభేదాలు మొదలయ్యాయి. రూ. 16 లక్షలు వ్యవహారం స్వాతి ఎక్కడ పోలీసులకు తన గురించి ఫిర్యాదు చేస్తుందో అని వీరభద్రం భయపడ్డాడు. మాయమాటలు చెప్పి స్వాతికి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. స్వాతిని ఎవరూ గుర్తుపట్టలేనంతగా 20 ముక్కలు చేశాడు వీరభద్రం.
Read also: Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరు..
ముక్కలుగా చేసిన స్వాతిని ఒక మూటలో వేసి.. పక్కనే వున్న పొలంలో పడేసి ఏమీ తెలియనట్లు వీరభద్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న భద్రాది పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు షాకింగ్ కు గురయ్యారు. ఒక మూటలో ముక్కలుగా వున్న మహిళ మృత దేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా అందులో వున్న ముక్కలైన మృతదేహం స్వాతిది అని గుర్తించారు. గత కొద్దిరోజులుగా స్వాతి అనే మహిళ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఇలా ముక్కలు చేసింది వీరభద్రం అని గుర్తించారు. వీరభద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pushpa 2 : చివర్లో టెన్షన్ పెడుతున్న పుష్పరాజ్?
తాజావార్తలు
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!