Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరు..
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం..
- దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఆగ్రహం..
- సీఎం మీద-ఈ ప్రభుత్వం మీద కోపంతో దాడి జరిగింది- సబితా ఇంద్రా రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని మండిప్డడారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని హెచ్చరించారు. మీ బెదిరింపులకు @BRSparty భయపడదన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.
Read also: BRS KTR: ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లారు. పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ పై దాడి జరగడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటన బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరిగిన ఘటన.. అధికారుల మీద కోపంతో కాదు ముఖ్యమంత్రి మీద కోపం ఈ ప్రభుత్వం మీద కోపంతో దాడి జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతుల బాధ వినండి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ల్యాండ్ కి సంబంధించి 8 నెలలు రైతులను ఒప్పించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నామన్నారు. ఇది న్యాయం కాదు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
New Dream Spa: స్పా ముసుగులో వ్యభిచారం.. చందానగర్ లో పోలీసులు రైడ్..
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?