Pune Rape Case: నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రివార్డు!
- పూణె రేప్ కేసు నిందితుడి ఫొటో విడుదల
- ఆచూకీ చెబితే రివార్డు ఇస్తామని పోలీసులు వెల్లడి
పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణెలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో యువతి(27)పై యువకుడు (36) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. యథావిధిగా బస్సు ఎక్కేందుకు వస్తే.. వేరే చోట బస్సు ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. స్నేహితురాలికి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత కరవైందని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
ఈ ఘటన మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గడేగా గుర్తించారు. ఇతనిపై అనేకమైన నేరాలు, కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. 2019 నుంచి ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఇతని కోసం 13 ప్రత్యేకమైన బృందాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఫేస్ మాస్క్ ధరించడంతో ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా నిందితుడి ఫొటోను విడుదల చేసింది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డ్ అందజేస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, పోలీస్ స్టేషన్లలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మంగళవారం ఉదయం 5.45 నుంచి 6 గంటల మధ్య అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణం జరగడం విశేషం. అయితే నిందితుడు.. ఆమెను చెల్లి అని సంబోధించడంతో నమ్మేసింది. సతారా జిల్లాల్లోని ఆమె తన స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా మాటలు చెప్పి.. ఎవరూ లేని బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సీసీ కెమెరాలో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే తాను బస్సులోపలికి వెళ్లేందుకు సంకోచించానని.. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని అబద్ధం ఆడి తీసుకెళ్లాడని.. అనంతరం డోర్లు వేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ముందుగా తనను బస్సు ఎక్కించాక.. అతడు లోపలికి వచ్చి అత్యాచారం చేశాడని పేర్కొంది. అనంతరం వెంటనే బస్సులోంచి దూకేసి పారిపోయాడని వాపోయింది. తన స్నేహితురాలి సూచనతో పోలీసులకు రిపోర్టు చేసినట్లు చెప్పింది.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది క్షమించరాని నేరమని.. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా వెంటనే నిందితుడిని పట్టుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు
తాజావార్తలు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో