MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.
- కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాలపై కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో ఉన్నారని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించడం తప్ప మరేదీ కాదన్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీలు కట్టిందని, కానీ దీనికి కారణం గత ప్రభుత్వ పాలన కాదని కవిత స్పష్టం చేశారు.
Read Also: Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
తెలంగాణ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం “హైడ్రా” అని వ్యాఖ్యానించిన కవిత.. హైడ్రా పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన నడిపిస్తున్నారని ఆరోపించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం పూర్తిగా పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే బాధ్యత వహించాలన్నారు. అలాగే SLBC ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై కూడా కవిత స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కోసం రూ. 3,890 కోట్లు ఖర్చు పెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అసలు పని చేయలేదని అన్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దారుణమని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసినప్పటికీ, ఆయన ఏ కొత్త ప్రయోజనం తెచ్చుకున్నారో తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రధాన ప్రాజెక్టులు రద్దయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణ కోసం కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న విధానం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ‘కట్టుబట్టలతో ఉన్న కుటుంబం’ అని వ్యాఖ్యానించిన ఆమె, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే లక్ష్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన సోదరుడిని కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
Read Also: Kaleswaram Commission: నేడు కృష్ణా జలాల పంపిణీపై కీలక భేటీకానున్న కాళేశ్వరం కమిషన్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు కవిత. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వీరి మధ్య విభేదాలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం సఖ్యతతో వ్యవహరిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్పై అహంకార ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, కొంతకాలం క్రితం ప్రముఖ మావోయిస్టు నేత గుమ్మడి నర్సయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరస్కరించిన ఘటనలోనే వారి అహంకారం బయటపడిందని కవిత అన్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మొత్తంగా, కవిత వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..