MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.
- కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాలపై కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో ఉన్నారని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించడం తప్ప మరేదీ కాదన్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీలు కట్టిందని, కానీ దీనికి కారణం గత ప్రభుత్వ పాలన కాదని కవిత స్పష్టం చేశారు.
Read Also: Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
తెలంగాణ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం “హైడ్రా” అని వ్యాఖ్యానించిన కవిత.. హైడ్రా పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన నడిపిస్తున్నారని ఆరోపించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం పూర్తిగా పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే బాధ్యత వహించాలన్నారు. అలాగే SLBC ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై కూడా కవిత స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కోసం రూ. 3,890 కోట్లు ఖర్చు పెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అసలు పని చేయలేదని అన్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దారుణమని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసినప్పటికీ, ఆయన ఏ కొత్త ప్రయోజనం తెచ్చుకున్నారో తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రధాన ప్రాజెక్టులు రద్దయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణ కోసం కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న విధానం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ‘కట్టుబట్టలతో ఉన్న కుటుంబం’ అని వ్యాఖ్యానించిన ఆమె, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే లక్ష్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన సోదరుడిని కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
Read Also: Kaleswaram Commission: నేడు కృష్ణా జలాల పంపిణీపై కీలక భేటీకానున్న కాళేశ్వరం కమిషన్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు కవిత. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వీరి మధ్య విభేదాలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం సఖ్యతతో వ్యవహరిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్పై అహంకార ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, కొంతకాలం క్రితం ప్రముఖ మావోయిస్టు నేత గుమ్మడి నర్సయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరస్కరించిన ఘటనలోనే వారి అహంకారం బయటపడిందని కవిత అన్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మొత్తంగా, కవిత వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!