Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mlc Kavitha Criticizes Cm Revanth Reddy Over His Meeting With Pm Modi

MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్

Published Date :February 27, 2025 , 11:58 am
By Kothuru Ram Kumar
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.
  • కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాలపై కీలక వ్యాఖ్యలు.
MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో ఉన్నారని, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించడం తప్ప మరేదీ కాదన్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీలు కట్టిందని, కానీ దీనికి కారణం గత ప్రభుత్వ పాలన కాదని కవిత స్పష్టం చేశారు.

Read Also: Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలంగాణ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం “హైడ్రా” అని వ్యాఖ్యానించిన కవిత.. హైడ్రా పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన నడిపిస్తున్నారని ఆరోపించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం పూర్తిగా పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలే బాధ్యత వహించాలన్నారు. అలాగే SLBC ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై కూడా కవిత స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కోసం రూ. 3,890 కోట్లు ఖర్చు పెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అసలు పని చేయలేదని అన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దారుణమని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసినప్పటికీ, ఆయన ఏ కొత్త ప్రయోజనం తెచ్చుకున్నారో తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రధాన ప్రాజెక్టులు రద్దయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణ కోసం కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న విధానం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ‘కట్టుబట్టలతో ఉన్న కుటుంబం’ అని వ్యాఖ్యానించిన ఆమె, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే లక్ష్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన సోదరుడిని కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

Read Also: Kaleswaram Commission: నేడు కృష్ణా జలాల పంపిణీపై కీలక భేటీకానున్న కాళేశ్వరం కమిషన్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు కవిత. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వీరి మధ్య విభేదాలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం సఖ్యతతో వ్యవహరిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై అహంకార ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, కొంతకాలం క్రితం ప్రముఖ మావోయిస్టు నేత గుమ్మడి నర్సయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరస్కరించిన ఘటనలోనే వారి అహంకారం బయటపడిందని కవిత అన్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మొత్తంగా, కవిత వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ విధానాలు, బీజేపీకి సహకారం అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalvakuntla kavitha
  • kcr
  • revanth reddy
  • SLBC Project
  • telangana government

తాజావార్తలు

  • Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

  • JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

  • Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

  • Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

ట్రెండింగ్‌

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions