Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరియాణా పానిపత్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. దీంతో తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించింది. అనతరం తాను అనుకున్నట్లుగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడం వల్లే ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన 2017లో జరగగా.. తాజాగా నిందితురాలికి శిక్ష పడింది. జ్యోతి క్రిష్ణ అనే ఇద్దరు యువతీయువకులు కాలేజీ నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని జ్యోతి ఇంట్లో చెప్పారు. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
Also Read : Astrology : మార్చి 30, గురువారం దినఫలాలు
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
జ్యోతి పారిపోయినట్లుగా ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. తనలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించారు. ఈ టీవీ సీరియల్ ఆధారంగా ప్లాన్ చేశారు. పథకం ప్రకారం సిమ్రాన్ ను చంపాలని నిర్ణయించుకుని.. 2017 సెప్టెంబర్ 5న జీటీ రోడ్డుకు రమ్మన్నారు. మొదట ఆమెతో మత్తు కలిపిన కూల్ డ్రింక్ ను తాగించారు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సిమ్రాన్ బట్టలు మార్చారు. ఘటన స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి పారిపోయారు. ఓ హోటల్ లో కలిసి కొద్ది రోజులు జీవించారు.
Also Read : bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
ఇదిలా ఉండగా జ్యోతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పానిపత్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు చేశారు. దీనిపై విచానరణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్ మృతదేహాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చూపించారు. సిమ్రాన్ బాడీకి ఉన్న బట్టలు, డాక్యుమెంట్ల ఆధారంగా మృతదేహం జ్యోతిదే అయి ఉంటుందని భావించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో సిమ్రాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి సిమ్రాన్ మృతదేహం ఫొటోను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. సిమ్రాన్ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా ఆ ఫొటో తన కూతురుదేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో చనిపోయిన అమ్మాయి జ్యోతి కాదని.. సిమ్రాన్ అని తెలుసుకున్నారు.
Also Read : CM Jagan Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి జ్యోతి, క్రిష్ణను వెతికే పనిలో పడ్డారు. వారిద్దరు సిమ్లాలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగానే క్షయవ్యాధితో క్రిష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 26 మందిని విచారించిన పానిపత్ కోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. జ్యోతిని దోషిగా తేల్చింది. ఆమెకు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ 70 వేల జరిమాన విధించింది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!