Karnataka: భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానం.. 230 కి.మీ ప్రయాణించి ఆమెను చంపేసిన పోలీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.
కిషోర్ అనే 32 ఏళ్ల వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్లో నివసిస్తున్నాడు. అయితే అతని భార్య ప్రతిభ(24) 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోట్లోని తల్లిదండ్రుల ఇంటికి వెల్లింది. అనుమానం పెంచుకున్న అతను అంతదూరం ప్రయాణించి భార్యను పుట్టింటిలోనే చంపేశాడు. అంతకుముందు ప్రతిభకు కిషోర్ 150 సార్లు కాల్స్ చేశాడు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. కిషోర్ హత్యకు ముందు పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్గా ఉంది.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
కిషోర్, ప్రతిభలకు నవంబర్ 13, 2022న వివాహం జరిగింది. కాగా, తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కిషోర్ తరుచుగా ప్రతిభ ఫోన్కి వచ్చే మెసేజులు, కాల్స్ పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతీ వ్యక్తి గురించి ఆరా తీసేవాడని, తన కాలేజీలోని మగవారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తరుచుగా ఆరోపించేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి తిట్టాడు, ప్రతిభ ఏడవడంతో ఆమె తల్లి ఫోన్ తీసుకుని కాల్ డిస్ కనెక్ట్ చేసింది. ఈ గొడవలు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్ కి ఆన్సర్ ఇవ్వద్దని ఆమె తల్లి సూచించింది. సోమవారం కిషోర్ తన భార్యకు 150 సార్లు ఫోన్ చేసినట్లు ప్రతిభ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
సోమవారం ఉదయం కిషోర్, ప్రతిభ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు, ఆ తర్వాత దుపట్టాతో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. హత్యకు ముందు ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టాడు. అనుమానం వచ్చిన ప్రతిభ తల్లి తలుపు ఎంత కొట్టిన స్పందన రాలేదు. 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన కిషోర్… నేను ఆమెను చంపానంటూ అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..